Just In
- 26 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- News
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్మన్ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ లెక్కలు చూసి షాక్... ‘బాహుబలి 2’ రికార్డ్ తుస్సుమనేదా?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. వాటిలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' లాంటి కల్ట్ మూవీ ఒకటి. అప్పట్లో బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన ఈ సినిమా 2017లో విడుదలైతే 'బాహుబలి-2' రికార్డులను సైతం వెనక్కి నెట్టేసేదని తాజాగా ఓ అభిమాని వ్యాఖ్యానించడంతో అమితాబ్ సైతం ఆశ్చర్యపోయారు.
1977లో విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం గురించి ఓ అభిమాని చేసిన ట్వీట్ బిగ్ బి షేర్ చేశారు. అతడు చెప్పిన దాని ప్రకారం... 42 సంవత్సరాల క్రితం ఈ చిత్రం రూ. 7.25 కోట్లు వసూలు చేసింది. ద్రవ్యోల్బణం ప్రకారం లెక్క వేస్తే ఆ కలెక్షన్ ఇపుడు 'బాహుబలి-2' వసూళ్లను సైతం వెనక్కి నెట్టేదట.

అప్పట్లో ఆ సినిమాను 3,62,50,000 మంది చూశారు
1977లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ' విడుదలైన సమయంలో యావరేజ్ టిక్కెట్ రేటు రెండు రూపాయలు. అప్పట్లో ఈ సినిమాను 3,62,50,000 మంది చూశారు. 2017లో బాహుబలి-2 విడుదలైన సమయంలో టిక్కెట్ రేటే రూ. 150. ఈ రేటు ప్రకారం లెక్కవేస్తే... అమితాబ్ మూవీ ఇపుడు రిలీజ్ అయితే రూ. 543 కోట్లు వసూలు చేసేది.
|
అమితాబ్ ఆశ్చర్యం
2017లో విడుదలైన ‘బాహుబలి 2' చిత్రం హిందీ వెర్షన్ ఇండియాలో దాదాపు 510 కోట్లు వసూలు చేసింది. అభిమాని ‘అమర్ అక్బర్ ఆంటోనీ' గురించి ఈ లెక్కలన్నీ వేసి చూపడంతో అమితాబ్ బచ్చన్ సైతం ఆశ్చర్యపోయాడు.

‘అమర్ అక్బర్ ఆంటోనీ'
1977లొ విడుదలైన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతూ కపూర్, ప్రాణ్, పర్వీన్ బాబీ తదితరులు నటించారు. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించగా, ఖాదర్ ఖాన్ డైలాగులు అందించారు.

బాహుబలి 2
2015లో వచ్చిన ‘బాహుబలి' చిత్రానికి కొనసాగింపుగా 2017లో బాహుబలి 2 విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 కోట్లు వసూలు చేసి దంగల్ తర్వాత హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన రెండో చిత్రంగా రికార్డల కెక్కింది.