Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమితాబ్ హెల్త్ అప్డేట్.. అర్ధరాత్రి బిగ్బీ ట్వీట్ చేసి..
సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనావైరస్ పాజిటివ్తో బాధపడుతూ ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. బిగ్బీ తర్వగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన సమయంలో మనోధైర్యంతో అమితాబ్ ఉంటూ.. ప్రతీ రోజు నెటిజన్లు, అభిమానులు, సన్నిహితులతో ట్వీట్ల ద్వారా టచ్లో ఉంటున్నారు. గురువారం అర్ధరాత్రి తన ఆరోగ్యం గురించి ట్వీట్ చేసి తెలిపారు. అలాగే తన క్షేమాన్ని కోరిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
నా ఆరోగ్యం కుదుట పడాలని మీరందరూ ప్రార్థనలు చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది నాకు ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్స్తోపాటు సోషల్ మీడియా యాప్స్ ద్వారా నాకు సందేశాలు పంపారు. అందుకు నేను రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ నిబంధనలు అతిక్రమించి మరింత సమచారాన్ని ఇవ్వలేకపోతున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కరోనావైరస్ బారిన పడటంతో జూలై 11వ తేదీ శనివారం రాత్రి నానావతి హాస్పిటల్లో చేరారు. అలాగే కోవిడ్ 19 బారిన పడిన ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ సొంత నివాసంలోనే క్వారంటైన్లో ఉన్నారు. జయబచ్చన్కు కరోనా నెగిటివ్ అని రావడంతో అభిమానులకు ఉపశమనం లభించింది.