అనుపమ్ ఖేర్ భార్యకు క్యాన్సర్.. మాధురి దీక్షిత్ ఎమోషనల్
నటి, రాజకీయ నాయుకురాలైన కిరణ్ ఖేర్ (అనుపమ్ ఖేర్ భార్య) క్యాన్సర్తొ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. క్యాన్సర్తో పోరాడి బయటపడిన సెలెబ్రిటీలెందరో ఉన్నారు. అయితే కిరణ్ ఖేర్ బ్లెడ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలందరూ ట్వీట్లు పెడుతున్నారు.
మాధురి దీక్షిత్ ఎమోషనల్ అవుతూ.. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఆమెకు నా ప్రేమను తెలపండి సర్ అని కోరింది. అలాగే పరిణితి చోప్రా, రణ్ వీర్ షోరేస్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సెలెబ్రిటీల ట్వీట్లపై అనుపమ్ ఖేర్ స్పందించాడు. తన భార్యపై చూపిస్తోన్న ప్రేమకు ఎమోషనల్ అయ్యాడు.

ఆమె ఎంతో మంచిది.. అందుకే ఇంత మంది ఆమెను ప్రేమిస్తున్నారు.. మీకు ఎలా వీలైతే అలా.. మీ ప్రేమను పంపుతూ, పంచుతూ ఉండండి.. మీ హృదయంలోనే ఆమె కోసం కోరుకోండి.. మీ ప్రేమ, మద్దతు ఉంటే ఆమె త్వరగా కోలుకుని వస్తుంది.. ఆమె ప్రస్తుతం రికవరీ అవుతోంది అంటూ అనుపమ్ ఖేర్ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











