KLRahul Athiya Shetty Wedding అడంబరంగా పెళ్లి.. నో రిసెప్షన్.. నో హానీమూన్.. షాకిచ్చిన సునీల్ శెట్టి
బాలీవుడ్ నటి అతియాశెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ జనవరి 23వ తేదీన సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా, కేఎల్ రాహుల్ ఇద్దరు గత మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరి ప్రేమాయణం మీడియాలో గత కొన్ని నెలలుగా మీడియాలో వైరల్ అయింది. చివరకు ఇద్దరు ఒక్కటై వారిపై వచ్చే రూమర్లకు పెళ్లి ద్వారా తెరదించారు. అతియా, కేఎల్ రాహుల్ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పెళ్లి తర్వాత స్వీట్లు పంచి..
అతియాశెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లి సునీల్ షెట్టికి సంబంధించిన ఖండాలా ఫామ్హౌస్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య అడంబరంగా జరిగింది. పెళ్లి తర్వాత ఆతియా, రాహుల్ వచ్చి మీడియాకు కనిపించారు. పెళ్లి సందర్భంగా వారు స్వీట్లు పంచి మీడియాతో ఆనందాన్ని పంచుకొన్నారు. అనంతరం వారు మీడియాతో కాసేపు గడిపి ఫామ్హౌస్లోకి వెళ్లారు.

అతిథులు ఎవరెవరు అంటే..
అతియా, రాహుల్ పెళ్లి అతికొద్ది మంది అతిథులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయ బద్దంగా జరిగింది. సెలబ్రిటీలు రాకతో ఆ ప్రాంతమంతా విలాసవంతమైన కార్లు, వాహనాలతో సందడిగా మారిపోయింది. సెలబ్రిటీలు డయానా పెంటీ, కృష్ణ ష్రాప్, అంశులా కపూర్, క్రికెటర్లు వరుణ్ ఆరోన్, ఇశాంత్ శర్మ తదితరులు పెళ్లికి హాజరయ్యారు.

మామను కాదు.. నేను అంటూ
అతియా, రాహుల్ పెళ్లి సమయంలో సునీల్ శెట్టి వీడియో ద్వారా కొంత సమాచారాన్ని అందించాడు.ఈ వేడుకకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అడంబరంగా పెళ్లి జరిగింది. నా అల్లుడు కాదు.. కొడుకు ఇంటికి వచ్చాడని భావిస్తున్నాను. మామ హోదాలో కొత్త పాత్ర కాదు. నేను అతడికి తండ్రిలాంటి పాత్రను పోషిస్తాను. అత్తగారిల్లు అంటూ దూరం చేసే ప్రయత్నం చేయలేను. నా కొడుకులా రాహుల్ను భావిస్తున్నాను అని సునీల్ శెట్టి కామెంట్ చేశారు.

ఐపీఎల్ ముగిసిన తర్వాతే..
అతియా, రాహుల్ పెళ్లి తర్వాత రిసెప్షన్ గురించి సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో రిసెప్షన్ నిర్వహించడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత విందు వేడుకను నిర్వహిస్తాం. మే నెలలో గానీ, జూన్ నెలలో గానీ రిసెప్షన్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ తేదీని మీడియాకు అధికారికంగా ప్రకటిస్తాం అని సునీల్ శెట్టి చెప్పారు.

హానీమూన్ ట్రిప్ వాయిదా?
ఇక రాహుల్, అతియా హానీమూన్ ట్రిప్పై పెద్దగా క్లారిటీ లేదు. కేఎల్ రాహుల్ క్రికెటర్ టూర్లతో బిజీగా ఉండటంతో హానిమూన్ ట్రిప్ వాయిదా వేసుకొనే అవకాశాలు ఉన్నాయి. పిబ్రవరి 9 నుంచి జరగబోయే బోర్డర్, గవాస్కర్ ట్రోఫి కోసం ఇండియా టీమ్లో రాహుల్ చేరాల్సి ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ కూడా ప్రారంభం కావడంతో కేఎల్ రాహుల్ షెడ్యూల్ బిజీగా మారిపోయింది. సమయం చిక్కితే యూరప్కు హానిమూన్ ట్రిప్ కోసం వెళ్లే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నది.


Click it and Unblock the Notifications











