జాన్వీ కపూర్ తొలి చిత్రం షూటింగ్ పూర్తి.. హీరోతో ఉన్న అందమైన ఫోటో!
తన కుమార్తె జాన్విని పెద్ద హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కంది. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చిత్ర దర్శకుడు, హీరో ఇషాన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోకు జాన్వీ హోమ్ అనే క్యాప్షన్ పెట్టడం విశేషం.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ ఈ చిత్రానికి దర్శకుడు. దఢక్ చిత్రం ఘనవిజయం సాధించిన మరాఠీ చిత్రం సైరాత్ కు రీమేక్ గా రూపొందుతోంది. ప్రేమ కథ చిత్రంగా రూపొందుతున్నా ఈ చిత్రపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
శ్రీదేవి కుమార్తె తొలి చిత్రంలో ఎలా నటించిందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. శ్రీదేవి ఈ చిత్ర ప్రారంభానికి ముందు తన కుమార్తె విషయాలు పలు జాగ్రత్తలు తీసుకుంది. తన కుమార్తెకు మంచి గుర్తింపు రావాలని తపించింది. కానీ శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయిలో అనూహ్య పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











