Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ట్రైలర్: దేశ భక్తి రగిలించే రియల్ స్టోరీ
విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గోల్డ్'. 1936 నుంచి 1948 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రీమా కగ్టి దర్శకత్వం వహించారు. మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సద్, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం 1948లొ లండన్లో జరిగిన ఒలంపిక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. 200 సంవత్సరాలు మనల్ని పాలించిన బ్రిటిష్ వారు మన జెండాకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన కోచ్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు.
'ఓ కల నిజం కావడానికి 12 సంవత్సరాలు పట్టింది' అంటూ విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడిలో దేశభక్తి రగిలించేలా ఉంది. ట్రైలరే ఈ స్థాయిలో ఉందంటే థియేటర్లో సినిమా చూస్తే రొమాలు నిక్కబొడిచి పులకించి పోవడం ఖాయం.
రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ చిత్రానికి సచిన్-జిగర్ అందించారు. ఈ ట్రైలర్ను అక్షయ్ ట్విటర్లో షేర్ చేస్తూ... 'బ్రిటిషు ఇండియాలో విజేతలు.. స్వాతంత్ర్య భారత దేశంలో లెజెండ్స్' అని ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.