Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నా భర్తే స్నేహితులతో పడక పంచుకోమన్నాడు.. అక్రమ సంబంధాలను తట్టుకోలేకపోయా: సీనియర్ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో సినీ తారలు ఎంతో స్టార్ డమ్ తో కనిపిస్తారు. కెమెరా ముందు ఎప్పటికి నవ్వుతూ కనిపించే వారి జీవితంలో అన్ని అలానే ఉంటాయని అనుకోవడం పొరపాటే. తెరవెనుక జరిగే కొట్లాటలు దారుణాలు సినిమాల్లో ట్విస్టుల కంటే దారుణంగా ఉంటాయి. ఇటీవల ఒక అగ్ర హీరోయిన్ చెప్పిన బయటపెట్టిన ఒక దారుణమైన విషయం మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు 90ల కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కరిష్మా కపూర్.
బాక్సాఫీస్ హిట్ సినిమాలతో భారీ క్రేజ్
జిగర్ (1992), అనారి (1993), రాజా బాబు అండ్ సుహాగ్ (1994), కూలీ నెంబర్ 1 (1995), గోపి కిషన్ (1995) వంటి సినిమాలతో అప్పట్లో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ సీనియర్ నటి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. 46ఏళ్ల వయసులో కూడా ఆమె తనదైన గ్లామర్ తో నేటితరం హీరోయిన్స్ కు పోటీని ఇస్తోంది.
షారుక్ సినిమాల్లో స్పెషల్ గా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ నటిగా మంచి క్రేజ్ అందుకుంటోంది. కపూర్ ఫ్యామిలీలో కరిష్మా బెస్ట్ హీరోయిన్ అనే బ్రాండ్ ను కూడా అందుకుంది. ఇక 2003 తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈ సినీయర్ నటి 2007లో షారుక్ తో ఓం శాంతి ఓం సినిమాలో స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది. 2018లో షారుక్ జీరో సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించింది.
మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు
ఇక చాలా రోజుల తరువాత కరిష్మా కపూర్ తన గత జీవితంలోని చేదు అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా ఆమె మాజీ భర్త సంజయ్ కపూర్ పై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేశాయి. మొదట్లో విడాకులు తీసుకోవడానికి కారణం కరిష్మా కపూర్ పొరపాటు చేసినందు వల్లే అంటూ అనేక రకాల రూమర్స్ వచ్చాయి.
నరకం అనుభవించాను
ఇక కరిష్మా ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆ రూమర్స్ కు చెక్ పడింది. ఆమె మాట్లాడుతూ.. వివాహం తరువాత జీవితం ఎంతో సరదాగా ఉంటుందని అనుకున్నా . కానీ ఒక్కసారిగా మారిపోతుందని ఉహీంచలేదు. ప్రతి రోజు నరకం అనుభవించాను. హనీమూన్ రోజే అసలు విషయం అర్ధమైందని ఆ రోజును ఇంక మరచిపోలేనని చెప్పింది.
Recommended Video
స్నేహితులతో కలిసి పడక పంచుకోవాలని..
హనీమూన్ లో నా భర్త సంజయ్ కపూర్ తోటి స్నేహితులతో కలిసి పడక పంచుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను నిరాకరించినప్పటికి బలవంతం చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం ఆలోచించకుండా కొట్టాడు కూడా. అంతే కాకుండా నన్ను పెళ్లి చేసుకున్న తరువాత అతని మొదటి భార్యతో కూడా సంబంధం పెట్టుకునేవాడు. నిలదీసేందుకు ప్రయత్నం చేశాను. అయినా కూడా ఏ మాత్రం మారలేదు. అందుకే విడాకులు తీసుకున్నట్లు.. కరిష్మా వివరణ ఇచ్చింది.