Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Aryan Khan: డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడికి క్లీన్ చిట్
ముంబై క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో సమీర్ వాంఖడేపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వాస్తవానికి ఎన్సీబీ శుక్రవారం కోర్టులో చార్జిషీట్ను సమర్పించింది. ఈ హై ప్రొఫైల్ డ్రగ్స్ కేసులో, 6 నెలల తర్వాత, ఎన్సిబి 6000 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది, దీనిలో 20 మంది నిందితులలో 14 మంది NDPS చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బుక్ చేయబడింది. ఆర్యన్ ఖాన్ సహా మిగిలిన 6 మంది నిందితులకు సాక్ష్యాలు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇచ్చింది. చార్జిషీట్లో ఆర్యన్ ఖాన్ పేరు లేదు. ఆర్యన్ ఖాన్కు క్లీన్ చిట్ లభించడంపై, సమీర్ వాంఖడే సహా ఆయన టీమ్ ఈ విషయంలో తప్పు చేశారని ఎన్సిబి డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ అంగీకరించారు. నిజానికి సమీర్ వాంఖడే నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో ప్రభుత్వం ఇప్పటికే ఆయన మీద చర్యలు తీసుకుంది.
వాంఖడే కోర్డెలియా క్రూయిజ్ షిప్పై దాడి చేసి క్రూయిజ్లో అనేక రకాల మాదక ద్రవ్యాలతో పాటు రూ.1.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై కోర్టులో దాఖలు చేసిన ఎన్సిబి ఛార్జిషీట్లో ఖచ్చితమైన సాక్ష్యం లేని కారణంగా ఆర్యన్ ఖాన్ సహా మరో ఐదుగురు పేర్లు పేర్కొనలేదని నివేదించారు. క్రూయిజ్ షిప్ నుంచి 14 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆర్యన్ ఖాన్ సహా అతని సహచరులు, అర్బాజ్ మర్చంట్ అలాగే మున్మున్ ధమేచాను సెంట్రల్ ఏజెన్సీ అక్టోబర్ 3న మధ్యాహ్నం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఇదే కేసులో మరో 17 మందిని అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ కూడా దాదాపు 28 రోజుల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉండాల్సి వచ్చింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో బాంబే హైకోర్టు బెయిల్పై విడుదల చేసింది.
మర్చంట్, ఆర్యన్ ఖాన్ మరియు మున్మున్ ధమాచాలకు బెయిల్ మంజూరు చేసింది. ఇక శుక్రవారం ఆర్యన్ ఖాన్ కేసులో క్లీన్ చిట్ పొందిన తరువాత, మహారాష్ట్రలోని అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఈ కేసులో ఆర్యన్ ఎదుర్కొన్న ఇబ్బందులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఎన్సిబి అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దేశ ప్రజలకు జవాబుదారీగా ఉన్నారని ఎన్సిపి పేర్కొంది. తొలుత ఈ కేసును ఎన్సీబీ ముంబై విచారించింది. తర్వాత డిడిజి (ఆపరేషన్స్) శ్రీ సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఎన్సిబి హెడ్క్వార్టర్స్, ఢిల్లీ నుండి ఒక SIT ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక దర్యాప్తు బృందం 06 నవంబర్ 2021న విచారణ చేపట్టింది. . డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ క్లీన్ అవ్వడంతో సినీ ఇండస్ట్రీలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ నటి పూజా భట్ కూడా సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేసింది.