Don't Miss!
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అన్నీ అమితాబ్ కే.. మాకేమీ లేవు… బతికే ఉన్నాంగా, సీనియర్ నటుడి ఆవేదన!
నాలుగు దశాబ్దాలుగా హిందీ సినిమాలలో కనిపిస్తున్న నటుడు శరత్ సక్సేనా నెగిటివ్ రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్ ప్రారంభ రోజుల్లో, శరత్ చాలా చిత్రాలలో విలన్ సహాయక పాత్ర పోషించాడు. కానీ ఈనాటికీ అతను బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందలేకపోయాడు. ఈయన అమితాబ్ బచ్చన్ కి ఒకరకంగా సమకాలీనుడు. అయితే అమితాబ్ బచ్చన్ ఈ రోజు బాలీవుడ్ యొక్క షహెన్షా. కానీ ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చినా తనకు గుర్తింపు రాలేదు ఎందుకు అనే అంశం మీద స్పందిస్తూ శరత్ సక్సేనా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శరత్ సక్సేనా మాట్లాడుతూ సీనియర్ నటుల కోసం రాసిన మంచి పాత్రలన్నీ అమితాబ్కు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ మాట్లాడుతూ, 'చిత్ర పరిశ్రమ యువతకు చెందినది, వృద్ధులు ఇక్కడ అవసరం లేదు. దురదృష్టవశాత్తూ, మేము చనిపోవడం కూడా లేదు.
మేము ఇంకా సజీవంగా ఉన్నాము మరియు పని కోసం చూస్తున్నాము, పరిశ్రమలోని సీనియర్ల కోసం ఎన్ని పాత్రలు వ్రాస్తారు? ఏ మంచి పాత్రలు రాసినా అవన్నీ అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్తాయి. 'పనికిరాని వస్తువుల లాంటి పాత్రలు అన్నీ మాలాంటి వారికి ఇస్తారు, మేము ఎక్కువ సమయం తీసుకోకుండా వాటిని తిరస్కరిస్తామని అన్నారు. కాబట్టి నా లాంటి వ్యక్తులకి పని దాదాపు సున్నా అని చెప్పుకొచ్చారు.
అలాగే యవ్వనంగా కనిపించడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. '71 సంవత్సరాల వయస్సులో, నేను ప్రతిరోజూ రెండు గంటలు వర్కౌట్ చేస్తాను, తద్వారా నేను 25 సంవత్సరాల అబ్బాయిలను ఓడించేలా బాడీ మైంటైన్ చేస్తున్నానని అన్నారు. నేను నా జుట్టు మరియు మీసాలకు రంగు వేస్తానని అన్నారు. ఇక శరత్ సక్సేనా ఇటీవల విడుదలైన షెర్ని సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక శరత్ సక్సేనా తెలుగులో సింహాద్రి, బన్నీ,ఎస్పీ పరశురామ్ లాంటి సినిమాల్లో కనిపించారు.