Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘ఆ డైరెక్టర్ పిచ్చిపనులతో విసిగిపోయా.. ఆరేళ్లుగా వేధింపులు’
బాలీవుడ్ తార స్వర భాస్కర్ మరోసారి లైంగిక వేధింపులపై నోరువిప్పింది. ఓ డైరెక్టర్తో ఎదురైన శారీరక వేధింపులను ఓ వేదికపై బహిరంగ పరిచింది. హలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్స్టెయిన్ జీవితం, వివాదాలపై జరిగిన చర్చలో నటి దియా మిర్జా, ఆనంద్ పట్వర్థన్తో కలిసి స్వరభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ డైరెక్టర్ చేసిన అకృత్యాలను బయటపెట్టింది. అయితే డైరెక్టర్ పేరును మాత్రం వెల్లడించడానికి నిరాకరించింది. ఇంతకీ ఆమెకు ఎదురైన వేధింపులు ఏమిటంటే..
ఆ దర్శకుడు అలా ప్రవర్తించేవాడు
ఓ సినిమాకు పనిచేసే సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించేవాడు. ఎప్పుడూ శారీరక అనుభవం కోసం ప్రయత్నించేవాడు. తనతో ప్రవర్తించి తీరును అర్ధం చేసుకోవడానికి ఆరేళ్లు పట్టింది. అలాంటి వ్యక్తి వల్ల మానసికంగా చాలా నష్టపోయాను అని స్వరభాస్కర్ పేర్కొన్నది.
మూడేళ్ల క్రితం కూడా ఓ డైరెక్టర్
మూడు ఏళ్ల క్రితం కూడా ఓ డైరెక్టర్ ఇలానే ప్రవర్తించాడు. అతడు అలా వ్యవహరిస్తాడని నేను అనుకోలేదు. కానీ ఎలాగో అలా తప్పించుకొన్నాను. నా ఒంటిపై చేయి పడకుండా జాగ్రత్తగా కాపాడుకొన్నాను. అలాంటి సంఘటన తలచుకొంటేనే నాకు భయంగా ఉంటుంది అని స్వర భాస్కర్ పేర్కొన్నారు.
డైరెక్టర్ పిచ్చిపనులు తెలిసేవి
డైరెక్టర్ చేసే పిచ్చి పనులు నాకు స్పష్టంగా అర్ధమయ్యేవి. కానీ నా మనసును అదుపులో పెట్టుకొని సానుకూలంగా వ్యవహరించే దానిని. ఆ డైరెక్టర్ చెడ్డవాడు కాకపోవచ్చు. కానీ తాను అవకాశం ఇచ్చినందుకు ఇతరుల నుంచి ఏదో రకంగా లబ్ది పొందాలని చూసేవాడు అని స్వర భాస్కర్ తెలిపారు.
బయటకు చెబితే దోషిగా చూస్తారు
మన దేశంలో లైంగిక వేధింపులను బయటకు చెప్పే సంస్కృతి ఇంకా రాలేదు. అలాంటివి బయటకు చెబితే బాధితురాలినే దోషిగా చూసే పరిస్థితి ఉంటుంది. ప్రతిభను కాకుండా ఇతర అంశాలను చూడటం ప్రపంచమంతా ఉంది. కానీ బాధితులకు ఇది చాలా అశాంతిని కలిగిస్తుంది అని స్వరభాస్కర్ అభిప్రాయపడ్డారు.