Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఆటోనగర్ సూర్య' ఆడియో విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా రూపొందిన చిత్రం 'ఆటోనగర్ సూర్య'. సమంత హీరోయిన్. దేవా కట్టా దర్శకుడు. అచ్చిరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఆడియోని జనవరి 19న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. మొదట జనవరి 16న అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని మార్చి 19 కి రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా అని అక్కినేని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో ఫైనాన్సియల్ సమస్యలతో ఆగి మళ్లీ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అచ్చిరెడ్డి ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.
నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్య పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనూప్ చక్కటి స్వరాలందించారు. పాటల్ని త్వరలో విడుదల చేస్తాం''అన్నారు. "ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నాం. నాగచైతన్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా చక్కని స్వరాలు కూర్చారు. అలాగే రీరికార్డింగ్ చాలా బాగా చేస్తున్నారు. జనవరి 18న వైభవంగా ఆడియో వేడుక జరుపుతున్నాం. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా సినిమా వచ్చింది'' అని చెప్పారు. '
దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో చెడుని అంతం చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ముందుకు రారు. అలా వచ్చిన యువకుడి జీవితమే మా సినిమా'' అన్నారు.ఆటోనగర్ ప్రాంతంలో అతడు ఏం చెప్తే అది జరగాల్సిందే.. కారణం అతడంటే భయం కాదు. ఆ యువకుడి మాటపై గురి అలాంటిది. పేదల పక్షాన నిలబడి ఎవరినైనా... ఎంతటి వారినైనా ఎదిరించే ఆ కుర్రాడి కథే మా సినిమా అంటున్నారు.
. 'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.