Veera Simha Reddy 13 Days Collections: బాలయ్యకు మరో షాక్.. 13వ రోజు ఘోరం.. సినిమాకు లాభాలు మాత్రం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్గా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులు పట్టించుకోకుండా సినిమాలు చేసే ఆయన.. ఈ మధ్య మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ జోష్లోనే ఈ సంక్రాంతికి ఆయన 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి టాక్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, రెండో వారంలో మాత్రం క్రమంగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' సినిమా 13 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే ఓ లుక్కేయండి మరి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ రచ్చ
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే 'వీర సింహా రెడ్డి'. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు
బాలయ్య రేంజ్కు ప్రకారమే 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసుకుంది.

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. కానీ, రెండో రోజు నుంచే అనుకున్న దానికంటే తక్కువగా వస్తున్నాయి. 12వ రోజు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 13వ రోజు దీనికి రూ. 12 - 13 లక్షలు వచ్చినట్లు తెలిసింది.

13 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'వీర సింహా రెడ్డి' మూవీకి 13 రోజుల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 16.71 కోట్లు, సీడెడ్లో రూ. 16.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.14 కోట్లు, గుంటూరులో రూ. 6.30 కోట్లు, కృష్ణాలో రూ. 4.64 కోట్లు, నెల్లూరులో రూ. 2.89 కోట్లతో కలిపి.. రూ. 63.72 కోట్లు షేర్, రూ. 103.22 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 63.72 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.77 కోట్లు, ఓవర్సీస్లో రూ. 5.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 13 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 74.21 కోట్లు షేర్, రూ. 124.91 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఇలా
బాలయ్య - గోపీచంద్ కలయికలో వచ్చిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి దాదాపు రూ. 74.21 కోట్లు వచ్చాయి. అంటే ఈ చిత్రానికి హిట్ స్టేటస్తో పాటు రూ. 21 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

అతి తక్కువ వసూళ్లతో దెబ్బ
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే 12, 13వ రోజు ఈ చిత్రానికి అతి దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది.


Click it and Unblock the Notifications











