Veera Simha Reddy 5 Days Collections: ఐదో రోజూ ఊచకోత.. బాలయ్య సంచలన రికార్డు.. అప్పుడే అన్ని కోట్లా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమై ముద్రను వేసుకుని సుదీర్ఘ కాలంగా స్టార్గా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్న ఆయన.. సంక్రాంతి కానుకగా 'వీర సింహా రెడ్డి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఐదో రోజు కూడా ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టి పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి 5 రోజుల రిపోర్టుపై లుక్కేయండి!

వీర సింహా రెడ్డిగా బాలయ్య రచ్చ
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన పవర్ఫుల్ యాక్షన్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు.

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు
బాలయ్య మార్కెట్ ప్రకారమే 'వీర సింహా రెడ్డి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ జరిగింది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.56 కోట్లు, సీడెడ్లో రూ. 1.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 55 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి.. రూ. 6.25 కోట్లు షేర్, రూ. 10.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
5 రోజుల్లోనూ 'వీర సింహా రెడ్డి' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 13.67 కోట్లు, సీడెడ్లో రూ. 13.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.20 కోట్లు, గుంటూరులో రూ. 5.30 కోట్లు, కృష్ణాలో రూ. 3.51 కోట్లు, నెల్లూరులో రూ. 2.18 కోట్లతో కలిపి.. రూ. 50.55 కోట్లు షేర్, రూ. 81.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 50.55 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.05 కోట్లు, ఓవర్సీస్లో రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 59.90 కోట్లు షేర్, రూ. 110 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 59.90 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.10 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది.

బాలకృష్ణ మరో సంచలన రికార్డు
'వీర సింహా రెడ్డి' మూవీకి టాక్తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా ఐదో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.25 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'అఖండ' పేరిట ఉన్న రూ. 3.58 కోట్లు రికార్డును బాలయ్య బ్రేక్ చేశారు. అలాగే, ఐదో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఈ మూవీ చోటు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











