Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
డీజే నష్టాలు ఫిదాతో భర్తీ.. యమా జోష్లో కలెక్షన్లు..
ఫిదా చిత్రం నిర్మాత దిల్ రాజుకు కాసుల పంట పండిస్తున్నది. కలెక్షన్లపరంగానే కాకుండా ఒకే క్యాలెండర్ మూడు సక్సెస్లు సాధించిన నిర్మాతగా దిల్రాజు ఘనతను సాధించారు. ప్రస్తుతం ఫిదా కలెక్షన్లు ప్రపంచవ్యావ్తంగా దుమ్మురేపుతున్నట్టు సమాచారం. మొదటి వారంలో వంద కోట్ల మార్కును దాటే అవకాశం ఉందనే మాట వినిస్తున్నది.
డీజే నష్టాలు ఫిదాతో భర్తీ
ఫిదా కంటే ముందు చేసిన చిత్రం దువ్వాడ జగన్నాథం నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలు సంపాదించినప్పటికీ.. కొంతమంది డిస్టిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయనేది ఫిలింనగర్ టాక్. అయితే ఆ నష్టాలను ఫిదా భర్తీ చేయడం పంపిణీదారులు మంచి జోష్లో ఉన్నట్టు సమాచారం.
Recommended Video
మిలియన్ డాలర్ల క్లబ్లో ఫిదా
ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్స్ క్లబ్లో చేరింది. విడుదలైన రెండు రోజుల్లోపే మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చెప్పకనే చెప్పింది. వారాంతం తర్వాత కలెక్షన్లలో తగ్గుముఖం పట్టకపోగా మరింత పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికాలో కలెక్షన్లు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అమెరికాలో ఫిదా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. శనివారం 363,325 డాలర్లు, శనివారం 351,733 డాలర్లు, ఆదివారం 226,671 డాలర్లు, సోమవారం 159, 384 డాలర్లు, మంగళవారం 173,130 డాలర్లు మేర కలెక్షన్లు ఫిదా నమోదు చేసింది.
సంతోషంలో శేఖర్ కమ్ముల, చిత్ర యూనిట్
ఫిదా చిత్రం ఊహించినట్టే భారీ సక్సెస్ను సాధించడంతో చిత్ర యూనిట్, నటీనటుల్లో సంతోషంలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే శేఖర్ కమ్ములు, సాయి పల్లవి ఈ చిత్ర విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతేడాదికిపైగా పడిన తమ కష్టానికి ప్రేక్షకులు పట్టం కట్టారు అని వారు పేర్కొంటున్నారు.