50 రోజుల 'ఎవడు'...సెంటర్స్ లిస్ట్(ఏరియావైజ్)
హైదరాబాద్ : సంక్రాంతికి సందడి చేసిన చిత్రం 'ఎవడు'విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రామ్చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించడంతో అభిమానులు ఆ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆదరణ పొందింది. హీరోలు కలిసి నటిస్తే తప్పకుండా ఫలితాలుంటాయని మరోసారి చాటి చెప్పిన చిత్రమిది. అల్లు అర్జున్ తెరపై కనిపించింది కాసేపే అయినా... ఇద్దరు మెగా హీరోలు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అభిమానులు కూడా ఆనందించారు. 'ఎవడు' ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదివారంతో యాభై రోజులయ్యాయి. ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్ గా నటించారు. కాజల్ కీలక పాత్రలో కనిపించింది.

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో 34 సెంటర్లలలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ లిస్ట్ ఇదే...
నైజాం:
1.హైదరాబాద్
2.వరంగల్లు
3.ఖమ్మం
4.కరీంనగర్
5.మహబూబ్ నగర్
6.నిజామ బాద్
7.మిర్యాల గూడ
ఈస్ట్ గోదావరి
1.కాకినాడ
2.రాజమండ్రి
3. కొత్తపేట
వెస్ట్ గోదావరి
1.ఏలూరు
కృష్ణ
1.విజయవాడ
2.మచలీపట్నం
3.గుడివాడ
గుంటూరు
1.గుంటూరు
2.సత్తెనపల్లి
3.నరసరావు పేట
4. రే పల్లె
5. వినుకొండ
నెల్లూరు
1. నెల్లూరు
చిత్తూరు
1. చిత్తూరు
2.తిరుపతి
3.మదనపల్లి
4.శ్రీకాళహస్తి
కడప
1.పులివెందుల
అనంతపూర్
1.అనంతపూర్
వైజాగ్
1. వైజాగ్
2. గాజువాక
3. విజయనగరం
కర్నూలు
1. కర్నూలు
2. నంధ్యాల
3. అదోని
4. నందికొట్టూరు
5. ఆళ్ళగడ్డ
దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... ''కథలో కొత్తదనంతో పాటు చరణ్, అల్లు అర్జున్ నటన చిత్రానికి బలాన్నిచ్చింది. 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్చరణ్తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేను''అన్నారు.


Click it and Unblock the Notifications











