Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఓవర్ సీస్ కలెక్షన్స్ బాగున్నాయి..ఇక్కడ డల్
ముంబై: ఓవర్ సీస్ మార్కెట్లలో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన దిల్వాలే చిత్రం భారీ కలెక్షన్లుతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన కలెక్షన్ల వివరాల ప్రకారం విదేశాల్లో దిల్వాలే రూ. 149.80 కోట్లు. ఇక బాజీరావు కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే ఈ చిత్రం విదేశాల్లో రూ. 90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. జనవరి 8 వరకు పెద్ద చిత్రాలు లేక పోవడంతో ఈ చిత్రాల కలెక్షన్ల మరింత పెరిగే అవకాశం ఉందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ట్రేడ్ లో లెక్కల ప్రకారం దిల్వాలే చిత్రం సంవత్సరాంతపు కలెక్షన్లలో ఢీలా పడిపోయింది. ఆరంభంలో భారీ కలెక్షన్లతో 2015లో తొలి రోజు వసూళ్లలో మూడో స్థానం సంపాదించిన దిల్వాలే రెండో వారం పూర్తిగా ఢీలా పడిపోయింది. తొలివారంలో దేశీయంగా దాదాపు రూ. 102.65 కోట్లు వసూలు చేసిన ఈ సూపర్ హిట్ దిల్వాలే జోడి రెండో వారంలో మరాఠా యోధడు బాజీరావు దెబ్బకి పూర్తిగా ఢీలా పడిపోయి రూ. 31.22 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మరాఠా యోధుడు బాజీరావు పీష్వా జీవితం ఆధారంగా తెరకెక్కిన బాజీరావు మస్తానీ చిత్రం ఆరంభంలో తడబడినా.. తొందరలోనే కోలుకుని భారీ వసూళ్లు సాధించింది. దేశీయంగా తొలి రోజు రూ.12.80 కోట్ల మాత్రమే వసూలు చేసిన బాజీరావు విమర్శకుల ప్రశంసలు, మంచి రివ్యూలతో క్రమంగా పుజుకుని దేశీయ కలెక్షన్లలో భారీ ఓపెనింగ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న దిల్వాలే చిత్రానికి గట్టిపోటీ ఇచ్చింది. ఇప్పటి వరకు వసూలైన దేశీయ కలెక్షన్ల మొత్తం దాదాపు రూ. 162.35 కోట్లు. ఇది దిల్వాలే కంటే దాదాపు రూ. 20 కోట్లు ఎక్కువ కావడం విశేషం.
ఇప్పటికి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.211కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓవర్సీస్లో 90కోట్ల మార్కును చేరినట్లు ఎరాస్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.