Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
సూపర్ కలెక్షన్స్: మూడు రోజుల్లో రూ. 54 కోట్లు
హైదరాబాద్: అక్షయ్ కుమార్ నటించిన యాక్షన్ కామెడీ మూవీ ‘సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకోవడం గమనార్హం. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 54.44 కోట్లు వసూలు చేసింది.
తొలి రోజు ఈ చిత్రం రూ. 20.67 కోట్లు రాబట్టింది. రెండో రోజైన శనివారం వసూళ్లు కాస్త తగ్గడంతో రూ. 14.50 కోట్లు వచ్చాయి. సెలవురోజైన ఆదివారం మళ్లీ పుంచుకుని రూ. 19.27 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లో టోటల్ కలెక్షన్స్ రూ. 54.44 కోట్లకు చేరుకుంది. అక్షయ్ కుమార్ కెరీర్లో హయ్యెస్ట్ వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రంగా సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం నిలిచింది.
గతంలో అక్షయ్ కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రౌడీ రాథోడ్ చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
‘సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు అమీ జాక్షన్, లారా దత్తా, కేకే మీనన్ ముఖ్య పాత్ర పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల వసూళ్లను అందుకుంటుందని భావిస్తున్నారు.