Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈసారైనా ఆగకుండా రిలీజ్ అవుతుందా
హైదరాబాద్ : అజ్మల్, నిఖితా నారయణ్ జంటగా తెరకెక్కించిన వెన్నల్లో హాయి హాయి సినిమా. చాలా కాలంగా విడుదల కాకుండా ఉండిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల అవుతోంది. పిభ్రవరి 5న ఈ చిత్రం విడుదల చేయటానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమా ఎప్పుడో పూర్తైనా ఇంతవరకు రిలీజ్ కు మాత్రం నోచు కోలేదు. దాంతో సినిమా లేట్ అవుతున్నా కొద్ది దాని టైటిల్స్ మారుస్తూ వస్తున్నాడు డైరక్టర్ వంశీ. మొదట....తను మొన్నే వెళ్లిపోయింది అని ఆ తర్వాత...మెల్లగా తట్టింది మనసు తలుపు అని పెట్టాడు.
కాని అప్పటికి రిలీజ్ కాకపోవటంతో ఆ టైటిల్ ని కూడా చేంజ్ చేశాడు డైరక్టర్ వంశీ. గతంలో వంశీ డైరెక్ట్ చేసిన ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో ఓ పాట పల్లవిని తీసుకుని తన సినిమా టైటిల్ గా పెట్టాడు వంశీ.
చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ''ఆహ్లాదభరితమైన ప్రేమ కథ. ఓ యువతి కోసం సుశీల్, సత్య సాగించే అన్వేషణ విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది''అన్నారు. అజ్మల్ గతంలో "రంగం","రచ్చ" వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు.
తెలుగులో హీరోగా అజ్మల్ కి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. పూర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.