Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కర్నాటకలో 'విశ్వరూపం' పరిస్ధితి ఏంటి
బెంగుళూరు : కమల్ హాసన్ తాజా చిత్రం ' విశ్వరూపం' అనేక వివాదాలను మూట కట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మంగళవారం కర్నాటకలో విడుదలైంది. తాము పూర్తి సెక్యూరిటీ కల్పిస్తామని రాష్ట్రపోలీసులు పంపిణీదారులకు హామీనిచ్చారు. రెస్పాన్స్ బాగుందని, మంచి లాభాలు వస్తాయని డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నారు.
'' రాష్ట్రవ్యాప్తంగా 40 సినిమాహాళ్లలో చిత్రం విడుదలైంది. దాంతో అక్కడ రిలీజైంది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. బెంగుళూరులో 17 హాళ్లలో విడుదలైంది. అన్నీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి'' అని కర్నాటకకు ఏకైక పంపిణీదారు హెచ్.డి.గంగరాజు మీడియాకి చెప్పారు. చిత్రం శాంతియుతప్రదర్శనకు తాము సెక్యూరిటీ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
'' ముస్లిం సంస్థల ప్రతినిధులు నగర కమిషనర్ జ్యోతిప్రకాష్ మిర్జీని కలసి చిత్రంలో ఒక్క వాక్యం అంటే ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కారు అనేది చేర్చమని కోరారు. ఇది డిజిటల్ చిత్రం కావటం వల్ల అది సాధ్యం కాదు. కాని చిత్రం టైటిల్స్లో చేర్చేందుకు నిర్ణయించాను.'' అని గంగరాజు తెలిపారు. జనవరి 27న మిర్జీ ఈ చిత్రాన్ని చూశారు. తర్వాతే 28న చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేసినట్లు గంగరాజు తెలిపారు. చిత్రంలో అభ్యంతరకర దృశ్యాలు లేవని మిర్జీ సంతృప్తి చెందారన్నారు.