Just In
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 10 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 11 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక్క సినిమాతో భారీ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో
చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించింది 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా నటించిన ఈ సినిమాను స్వరూప్ తెరకెక్కించాడు. డిటెక్టివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను రాహుల్ యాదవ్ నిర్మించారు. సినిమా విడుదలైనప్పటి నుంచే హిట్ టాక్తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా.. తక్కువ బడ్జెట్తో వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమాలో హీరో నవీన్ నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అతడి నటన, హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తానికి చర్చనీయాంశంగా మారిపోయాడు చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' విజయంతో ఉత్సాహంతో ఉన్న ఈ యంగ్ హీరో.. మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు తీయాలనుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించాడు. అంతేకాదు, రోటీన్కు భిన్నమైన సినిమాల్లో నటించాలనుందని తన కోరికను వెల్లడించాడు. దీంతో అతడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నాల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అతడు త్వరలోనే భారీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్పై సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే సంస్థ నుంచి పిలుపు కూడా వచ్చిందని తెలుస్తోంది. నలభై ఏళ్ల చరిత్ర కలిగిన వైజయంతీ మూవీస్ గత సంవత్సరం 'మహానటి' సినిమాతో వచ్చింది. అలాగే మహేశ్ బాబు నటించిన 'మహర్షి' నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తమ సంస్థలో మరిన్ని సినిమాలు చేయడానికి అశ్వనీదత్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే త్వరలోనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీయాలని భావిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా రెడీ అయిపోయిందని తెలిసింది. ఈ సినిమాకే నవీన్ను తీసుకుంటున్నారని ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. నవీన్ ఈ సినిమానే కాకుండా 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' నిర్మాతతోనూ సినిమా చేయాల్సి ఉందని టాక్.