Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తొక్కేసాడంటూ...అల్లు అరవింద్ ని తిట్టిపోస్తున్నారు
అసలేం జరిగిందయ్యా అంటే...మారుతి దర్శకత్వంలో, అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న కొత్తజంట లో సంపు ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. కొత్తజంట సినిమాలో సంపూపై తెరకెక్కిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. ఇదిగో ఉన్నట్లుండి సంపూను కొత్తజంట ప్రాజెక్ట్ నుంచి తప్పించారు . దానికి కారణం నిడివి ఎక్కువ అన్నారు. కానీ అసలు కారణం వేరే ఉందని బయిటకు వచ్చేసింది.
సంపూర్ణేష్ పై తీసిన సన్నివేశాలు బాగా రావడంతో అతను...తన కుమారుడు అల్లు శిరీష్ ను ఎక్కడ డామినేట్ చేసేస్తాడోనన్న భయంతో అల్లు అరవిందే ఈ పనిచేయించినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలబడటానికి ప్రయత్నిస్తున్న అల్లు శిరీష్ కోసం.... సంపూను తొలగించి... పాత్ర నిడివి తగ్గించి పోసానిపై రీ-షూట్ చేశారట. సంపూను స్టార్ గా నిలిపిన ఫ్యాన్స్ ... ఫేస్ బుక్ వంటి సోషల్ వెబ్ సైట్స్... కొత్తజంట నుంచి తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పోస్ట్ లు పెట్టి మరీ అల్లు అరవింద్ ని తిట్టి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కొత్త జంట'. ఈ చిత్రం మే 1 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బన్ని వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మారుతి మాట్లాడుతూ... నేను.. నా జీవితం ఇంకేమీ వద్దు. డబ్బుంటేనే జీవితం... అది లేకపోతే ఇంకేమీ లేదు. ఇలాంటి మనస్తత్వం వారిద్దరిదీ. అనుకోకుండా కలుసుకున్నారు.. మనసులు కలుపుకొన్నారు. కానీ వారి ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ జంట కథే మా 'కొత్తజంట' అన్నారు .
నిర్మాత మాట్లాడుతూ ''ఇద్దరు స్వార్థపరులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. మారుతి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రమిది. ఈ నెల మూడోవారంలో పాటల్ని విడుదల చేస్తాము. శిరీష్ బాడీలాంగ్వేజ్కు సరిపోయే కథతో, కొత్త లుక్తో దర్శకుడు చిత్రాన్ని వైవిధ్యంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు''అన్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మారుతి.