twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కొమురం పులి' టిక్కెట్ రేటు పెంచే పనిలో అల్లు అరవింద్...

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కొమురం పులి చిత్రం టిక్కెట్ రేటుని 75 రూపాయలకు పెంచాలని పంపిణీ దారుడుగా అల్లు అరవింద్ నిర్ణయించుకున్నాడని సమాచారం. ఇప్పటివరకూ 50 రూపాయలు ఉన్న టిక్కెట్ కాస్ట్ దాంతో 75 రూపాయలు అవుతుంది. ఈ మేరకు అల్లు అరవింద్ చిత్ర నిర్మాత శింగనమల రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రమేష్ తాను అనుకున్న బడ్జెట్ కన్నా ఈ చిత్రం లిమిట్ దాటిపోయిందని కాబట్టి మొదటి అల్లు అరవింద్ కమిటయిన రేటు ఇవ్వలేనని అనటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టిక్కెట్లు పెంచే విషయమై స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓకే చేస్తే మొదటి రెండు వారాలు ఈ రేటుతో టిక్కెట్ రేటు పెరుగుతుంది. అప్పట్లో జై చిరంజీవ సమయంలో అశ్వనీదత్ అలా టిక్కెట్ రేటు పెంచిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X