Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జోరుమీదున్న స్టైలిష్ స్టార్.. సుకుమార్ కోసం రెడీ!
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకొని మెగా అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు విశేషాలు, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టు వివరాల కోసం ఆరా దీస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబో సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ కేరళలో పూర్తి చేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం బన్నీయేతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే 'అల.. వైకుంఠపురములో' బిజీ నుంచి బన్నీ బయటకొచ్చాడు కాబట్టి.. ఇక సుకుమార్ సెట్స్ పైకి వచ్చేస్తా అని చెప్పేశారట. ఈ మేరకు వచ్చేనెల మొదటివారం నుంచి బన్నీతో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారట సుకుమార్.
అల్లు అర్జున్ కెరీర్లో 20వ సినిమా ఈ మూవీ రూపొందుతోంది. తొలిసారి క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న ఆయనతో జోడీ కడుతుండటం విశేషం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. చిత్రంలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని టాక్. బన్నీ అభిమానుల టేస్ట్కి తగ్గట్టుగా సుక్కు ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట.
మరోవైపు 'అల వైకుంఠపురములో' సక్సెస్తో 2020 ఆరంభంలోనే హిట్ పట్టేయడంతో బన్నీపై క్రేజ్ డబుల్ అయింది. సంక్రాంతి కానుకగా ఆయనకి ఈ సక్సెస్ లభించడం పట్ల అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఈ సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.