Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
శర్వానంద్ కోసం కాకినాడకు అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..?
విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. మెగాస్టార్ చిరంజీవితో థమ్సప్ యాడ్లో కనిపించి, తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శర్వానంద్.. మొదట్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు.
ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలో పలు ఫ్లాప్స్ పలకరించినా.. ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత కొన్ని హిట్స్ రావడంతో శర్వానంద్ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 'పడిపడి లేచె మనసు' ఫ్లాప్ తర్వాత మరికొన్ని సినిమాలకు సంతకాలు చేసేశాడు.
ఈ యంగ్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'రణరంగం'. 1980 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతడు గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన చిత్ర టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు గురించి ఓ ఆసక్తికరం విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కాకినాడలో చేయబోతున్నారట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ వస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'పడిపడి లేచె మనసు' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ వచ్చాడు. అయితే, ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇందులో నటీనటుల పనితీరుకు చక్కని మార్కులే పడినప్పటికీ కన్విన్సింగ్గా లేని కథ వల్ల సినిమా నిరాశ పరిచింది.