Don't Miss!
- News
లోకేష్ యాత్ర కొత్త "టర్న్" - చంద్రబాబు వ్యూహాం: రంగంలోకి బాలయ్య - నందమూరి ఫ్యామిలీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంపై కొత్త రూమర్
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రం "ఆరెంజ్". ఈ చిత్రంపై ఇప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ చేయి దాటిపోయిందని, ముగ్గురు దర్శకులు చేస్తున్నారని రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే కొత్తగా ఈ చిత్రం గురించి మరో రూమర్ మొదలైంది. అది సినిమాలో జెనీలియా, రామ్ చరణ్ జోడీ కుదరలేదని, జెనీలియా బాగా ముదురుగా కనపడిందనీను. అందుకే భాస్కర్ వీరిద్దరిపై డ్యూయిట్స్ తీసే సాహసం చేయలేదని చెప్తున్నారు. అంతేగాక విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ లో కూడా వీరిద్దరి మధ్యన సరైన కెమిస్ట్రీ కనపడలేదని చెప్తున్నారు. అయితే ఇది కావాలని పుట్టించిన రూమరేనని ఈ సినిమా యూనిట్ కి చెందిన వారు కొట్టిపారేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువైందనేది నిజమేనని, ఆ విషయం ఆల్రెడీ నిర్మాత నాగబాబు ఒప్పుకున్నాడని, అయితే సినిమా మాత్రం ఖుషీ రేంజిలో మంచి రొమాంటిక్ కామిడిగా వచ్చిందని, హిట్టు గ్యారెంటీ అని చెప్తున్నారు. నాగబాబు కూడా చరణ్ కి, భాస్కర్ కి ఇది మూడో చిత్రం. ఖచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అంటున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.