Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంపై కొత్త రూమర్
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రం "ఆరెంజ్". ఈ చిత్రంపై ఇప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ చేయి దాటిపోయిందని, ముగ్గురు దర్శకులు చేస్తున్నారని రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే కొత్తగా ఈ చిత్రం గురించి మరో రూమర్ మొదలైంది. అది సినిమాలో జెనీలియా, రామ్ చరణ్ జోడీ కుదరలేదని, జెనీలియా బాగా ముదురుగా కనపడిందనీను. అందుకే భాస్కర్ వీరిద్దరిపై డ్యూయిట్స్ తీసే సాహసం చేయలేదని చెప్తున్నారు. అంతేగాక విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్స్ లో కూడా వీరిద్దరి మధ్యన సరైన కెమిస్ట్రీ కనపడలేదని చెప్తున్నారు. అయితే ఇది కావాలని పుట్టించిన రూమరేనని ఈ సినిమా యూనిట్ కి చెందిన వారు కొట్టిపారేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువైందనేది నిజమేనని, ఆ విషయం ఆల్రెడీ నిర్మాత నాగబాబు ఒప్పుకున్నాడని, అయితే సినిమా మాత్రం ఖుషీ రేంజిలో మంచి రొమాంటిక్ కామిడిగా వచ్చిందని, హిట్టు గ్యారెంటీ అని చెప్తున్నారు. నాగబాబు కూడా చరణ్ కి, భాస్కర్ కి ఇది మూడో చిత్రం. ఖచ్చితంగా ఇద్దరూ ఆరెంజ్ తో హేట్రిక్ పూర్తి చేస్తారు అంటున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.