Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవి 150 చిత్రంలో ఆ ఇద్దరు హీరోయిన్స్
పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరంజీవి అతి త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించడబోయే చిత్రం చిరుకి 150వ చిత్రం కావడం మరో విశేషం. దాంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు, ఎవరు డైరక్ట్ చేస్తారు అన్న విషయాలకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో.'స్టాలిన్" చిత్రంలో ఒక్క సాంగ్కే పరిమితమైన అనుష్క ఈ చిత్రంలో మాత్రం హీరోయిన్గా నటిస్తోందనీ, రెండో హీరోయిన్ గా ప్రియమణి లేదా విమల రామన్ పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఇక తన 150వ చిత్రం గురించి చిరంజీవి ఇలా చెప్తున్నారు..."ఇంద్ర, స్టాలిన్, ఠాగూర్ చిత్రాల్లో లాగానే రాబోయే సినిమాలోనూ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, సందేశం, సెంటిమెంట్...అన్నీ కలిపే స్క్రిప్టు తయారవుతుంది. సగటు ప్రేక్షకులు నా నుంచి ఏం ఆశిస్తారో అది తప్పకుండా అందిస్తాను. వారి ఆలోచనల్ని, ఎక్సపెక్టేషన్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను" అన్నారు చిరంజీవి. ఈ చిత్రానికి అధినాయుకుడు అనే టైటిల్ ని ఠాగూర్ మధు రిజిస్ట్రేషన్ చేసారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, వివి వినాయిక్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్శ్ స్క్రిప్టు అందించనున్నారని అంతటా వినపడుతోంది.