Just In
- 44 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్ప్యాక్తో అతను.. హాట్ హాట్గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబు మేనల్లుడి సినిమా రద్దయిందా? దిల్ రాజు ఎందుకిలా?
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ దసరా(2018) సందర్భంగా 'అదే నువ్వు అదే నేను' టైటిల్తో ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బేనర్లో శశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా లాంచ్ అయింది.
సుధీర్బాబు మూవీ 'నన్ను దోచుకుందువటే' ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నభా నటేష్ను ఇందులో హీరోయిన్గా ఎంపిక చేశారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీ రద్దయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీపిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

సినిమా రద్దు చేస్తున్నట్లు మహేష్ బాబుకు చెప్పారట
ఈ సినిమాను రద్దు చేస్తున్నట్లు మహేష్ బాబుతో పాటు.... గల్లా అశోక్ తండ్రి, ఎంపీ గల్లా జయదేవ్కు సమాచారం అదించారట. దిల్ రాజు చెప్పిన కారణంతో మహేష్ బాబుదో పాటు జయదేవ్ కన్విన్స్ అయినట్లు సమాచారం.

దిల్ రాజు ఎందుకిలా చేశారు?
సినిమా స్క్రిప్టు సంతృప్తికరంగా లేక పోవడం, ఇప్పటి పరిస్థితుల్లో ఆ కథ వర్కౌట్ అయ్యే అవకాశం లేక పోవడం వల్లే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారట. లాంచింగ్ విషయంలో తొందర పడకుండా గల్లా అశోక్ను మరో మంచి కథతో లాంచ్ చేస్తే బావుంటుందని మహేష్ బాబు, జయదేవ్లను ఒప్పించారట.
‘పేట' నిర్మాతకు దిల్ రాజు కౌంటర్: పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, నా డబ్బు కూడా చాలా పోయింది!

దిల్ రాజు జడ్డిమెంటు మీద నమ్మకంతో...
సినిమాను జడ్జ్ చేయడంలో ది బెస్ట్ నిర్మాతగా దిల్ రాజుకు పేరుంది. ఆయన ఏదైనా కథ బాగా కన్విన్స్ అయ్యారంటే అది బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ కొడుతుంది. ఒకటి రెండు తప్ప... చాలా విషయాల్లో దిల్ రాజు జడ్జిమెంట్ నిజం అయింది. ఆయపై నమ్మకంతోనే... మహేష్ బాబు, జయదేవ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే బేనర్లో ఉంటుందా?
గల్లా అశోక్ తన బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నట్లు ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అయింది కాబట్టి... త్వరలో మరో స్క్రిప్టుతో, మరో దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తారా? లేక ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.