Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కల్యాణ్తో బాహుబలి రైటర్.. మరో బిగ్ బడ్జెట్ మూవీ ప్లానింగ్..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేయాలని బాగానే కష్టపడుతున్నారు. ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ ఒప్పుకుంటే రెండేళ్ల తరువాత కూడా సినిమా చేయడానికి కొంతమంది రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కోసం ఒక సీనియర్ రైటర్ కథ కూడా రెడీ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా..
పవన్ కళ్యాణ్ తన 25ఏళ్ళ సినిమా కెరీర్ లో ఇప్పటివరకు వరుసగా నాలుగైదు సినిమాలను ఎనౌన్స్ చేయలేదు. గతంలో అయితే చాలా వరకు ఒక దాని తరువాత మరొకటి చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక బిగ్ స్క్రీన్ హీరో కంటే కూడా తన పర్సనల్ లైఫ్ స్టైల్ తో అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నాడు.
మూడేళ్ళ తరువాత వస్తున్న సినిమా..
ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ నుంచి దాదాపు మూడేళ్ళ అనంతరం వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 100కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది.
మార్కెట్ స్థాయిని పెంచేలా..
హిట్టయినా ప్లాప్ అయినా కూడా ఒకే రకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకునే పవన్ వకీల్ సాబ్ అనంతరం మాత్రం డిఫరెంట్ లైనప్ ను సెట్ చేసుకున్నాడు. ఆ సినిమాలు తప్పకుండా మార్కెట్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లడం కాయంగా కనిపిస్తోంది. అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దానికి చెందిన ఒక హిస్టారికల్ కథను చేస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కోసం బాహుబలి రైటర్
హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి వంటి దర్శకులను కూడా లైన్ లో పెట్టిన పవన్ కుదిరితే బాహుబలి రైటర్ రాస్తున్న కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తెలుస్తోంది. రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవన్ కోసం చాలా కాలంగా ఒక కథను రాయాలని అనుకుంటున్నాడట. ఇక పవన్ కు ఐడియా చెప్పగానే కథను డెవలప్ చేయమని చెప్పేశారని ఒక టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం స్టోరీని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్ వీలైనంత త్వరగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి మరోసారి పవన్ కు వినిపిస్తారని తెలుస్తోంది. మరి ఆయన రాసే కథను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.