twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పరమ వీర చక్ర' ఫ్లాప్ బాలకృష్ణకు పాఠాలు నేర్పిందా?

    By Srikanya
    |

    పరమవీర చక్ర పరాజయంతో బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని ఎలా గైనా హిట్ చేయాలని తలపోస్తున్నారు. అందుకోసం ఆయన రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా కథ,గెటప్స్ విషయంలో ఆయన దగ్గరుండి మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయనున్నారు. దాంతో ఆ మూడు గెటప్స్ వేటికవే స్పెషల్ గా ఉండాలని,రెగ్యులర్ గా పొరపాటున కూడా ఉండకూడదని ఆయన దర్శకుడుకి చెప్పినట్లు సమాచారం. పరమవీర చక్రలో చేసిన ద్విపాత్రాభినయం గెటప్స్ పెద్దగా ఆకట్టుకోలేదని అభిమానులు సైతం విమర్శిస్తూండగా ఆయన ఈ సారి ఆ పొరపాటు జరగకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కధ,కథనం కూడా పకడ్బందీగా ఉండాలని, మళ్ళీ సింహా తరహా విజయం సాధించాలంటే స్క్రిప్టుపై కసరత్తులు చేయాల్సిందేనని పదే పదే చెప్తున్నారుట.

    ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ నిర్మించారు. బాలకృష్ణ, బ్రహ్మానందం తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని యాక్షన్‌ సీన్స్ ను కూడా అక్కడే తీయనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ కనిపించే మూడు పాత్రల మధ్య సంబంధం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు‌. కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X