Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లెక్కల సంగతేంటీ.. క్రిష్పై బాలయ్య అసహనం
ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య పోటీ రిలీజ్ తర్వాత సద్దుమణగడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. కలెక్షన్ల పరంగా వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తున్నది.
ఖైదీ నంబర్ 150 చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్లో చేరిందటూ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఢంకా భజాయించేశారు. ఈ వ్యవహరం గౌతమి పుత్ర శాతకర్ణి హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ల మధ్య వివాదంగా మారినట్టు ఫిలింనగర్ టాక్. అల్లు అరవింద్ ప్రకటించినట్టుగానే శాతకర్ణి కలెక్షన్లను ఎందుకు ప్రకటించలేదని క్రిష్ ను బాలయ్య నిలదీసినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. శాతకర్ణి కలెక్షన్లను వెల్లడించకపోవడంపై బాలయ్య తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం.
దీంతో ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య పోటీ రిలీజ్ తర్వాత సద్దుమణగడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి రీఎంట్రీ మూవీగా విడుదలైన ఖైదీ నంబర్ 150కి అభిమానులు, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విమర్శల ప్రశంసలందుకొని కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా శాతకర్ణి పంపిణీదారులు, చిత్ర నిర్మాతల కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.