Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అయోధ్య తీర్పు ఎఫెక్టు... బాలకృష్ణ చిత్రంపై
ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రలో శ్రీరామరాజ్యం అనే చిత్రం అక్టోబర్ 30న ప్రారంభం అవుతుందనే వార్త అన్ని చోట్ల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ముహూర్తం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయోద్య తీర్పు నేపధ్యంలో ఈ ప్రారంభాన్ని ఓ వారం రోజులకు వాయిదా వేయటానికి నిర్ణయం తీసుకున్నారు.
ఇక అయోధ్యలోని వివాదాస్పద భూమిపై యాజమాన్య హక్కు ఎవరిదో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తీర్పు చెప్పేందుకు మార్గం సుగమమైంది. తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మాసనం తీర్పు చెబుతుంది.
అలాగే 'శ్రీరామరాజ్యం'లో బాలకృష్ణ రామునిగా నటించబోతుంటే, సీత పాత్రను నయనతార చేయబోతున్నారు.ఇటీవలే స్పెషల్ ఎఫెక్ట్స్లో జాతీయ అవార్డు సాధించిన కమల్ కణ్ణన్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ సమకూర్చనున్నారు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, కో-ఆర్డినేటర్: సి. ద్వారకానాథ్బాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ.