Don't Miss!
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఎవడు' తో ఆమెకు హాట్రిక్ ఖాయం?
హైదరాబాద్ : వరస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఐరన్ లెగ్ గా ముద్రపడిన శృతి హాసన్ కి 'గబ్బర్ సింగ్' బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆమెకు కొత్త ఉత్సాహం వచ్చింది.
తాజాగా ఆ హిట్ ని కంటిన్యూ చేస్తూ 'బలుపు'కూడా మంచి విజయం సాధించటంతో ఆమె ఆనందానికి అంతేలేదు. దాంతో ఇప్పుడామెను గోల్డెన్ గర్ల్ అంటున్నారు. ఆమెను తమ చిత్రాల్లో తీసుకోవటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో శృతి...రామ్ చరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో చేసింది. ఆ చిత్రం కూడా సక్సెస్ అయ్యి..ఆమెకు హాట్రిక్ ఖాయం అంటున్నారు. ఈ చిత్రంపై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. మరో ప్రక్క దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడియో పంక్షన్ లో కూడా శృతి మెరిసిపోయింది.
ఈ 27 ఏళ్ల ఈ సుందరి హిందీ మూవీ 'లక్' ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది. అయితే అక్కడ లక్కు కలిసి రాక సౌతిండియా దారి పట్టి పలు చిత్రాల్లో నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు ప్రాజెక్లులు చేస్తుంది. ఒకటి ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కాగా, రెండో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న 'డి-డే'. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున జులై 19న విడుదల కాబోతున్నాయి.