Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొడితే గట్టిగా కొట్టాలని.. మరోసారి అదే కథపై కష్టపడుతున్న చంద్రశేఖర్ యేలేటి
గోపిచంద్ హీరోగా చేసిన సాహసం సినిమా అప్పట్లో మంచి రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమాను ఇంకాస్త బాగా తీసి ఉంటే మరో లెవెల్లో హిట్టయ్యి ఉండేదని టాక్ వచ్చింది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి , గోపిచంద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేదు.
అయినప్పటికీ చంద్రశేఖర్ యేలేటిపై ఉన్న నమ్మకం ఎవరికి తగ్గలేదు. ఇటీవల చెక్ డిజాస్టర్ అయినప్పటికీ కూడా అతని మీద చాలా మందికి నమ్మకం ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అతనితో మాట్లాడి ఒక సినిమాను సెట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ప్రభాస్ తో యాక్షన్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు అయితే బాగానే వచ్చాయి. కానీ ప్రభాస్ లైనప్ చూస్తుంటే అది నమ్మడానికి కాస్త సందేహాన్ని కలిగిస్తోంది.
ఇక తీస్తే పెద్ద సినిమానే చేయాలని సాహసం తరహాలోనే ఒక యాక్షన్ అడ్వెంచర్ కథను రెడీ చేసుగున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి ఇటీవల నిర్మాతలకు వివరించగా మరోసారి రీ వర్క్ చేయమని సలహాలు ఇచ్చారట. అగ్ర హీరోలు ఎవరు కూడా ఇప్పట్లో డేట్స్ ఇచ్చేలా లేరు.
అందుకే కథపై మళ్ళీ రీ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. తలచుకుంటే చంద్రశేఖర్ పాన్ ఇండియా సినిమాను తీయగలడని నిర్మాతలు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఈసారైనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.