Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మీలో ఎవరు కోటీశ్వరుడు... చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
హైదరాబాద్: మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమో కూడా ఇటీవల రిలీజైంది. చిరంజీవితో షో కావడంతో ఈ కార్యక్రమంపై అంచనాలు మరింత పెరిగాయి.
సినిమా అయినా, టీవీ షో అయినా సెలబ్రిటీ పాపులారిటీ, అతని రేంజిని బట్టి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.
చిరంజీవి తొలిసారి బుల్లితెర మీద కనిపిస్తుండటంతో ప్రేక్షకలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎపిసోడ్ల కంటే ఈ షోకు టీఆర్పీ రేటింగ్ భారీగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎంత తీసుకుంటున్నారు?
ఒక్కో ఎపిసోడ్కు పదిలక్షల రూపాయలు చిరంజీవికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంత భారీ రెమ్యూరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. సౌత్ లో ఇప్పటి వరకు టీవీ షోలు సంబంధించి ఇదే హయ్యెస్ట్ అమౌంట్.
చిరంజీవి డిమాండ్ చేయలేదు
చిరంజీవి తనకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అసలు డిమాండ్ చేయలేదట. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ 150వ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ చేసేందుకు అంగీకరించారు.
తక్కువే...
వాస్తవానికి చిరంజీవి రేంజి, ఆయనకున్న స్టార్ ఇమేజ్ తో పోల్చితే ఒక్కో ఎపిసోడ్ రూ. 10 లక్షలు పెద్ద మొత్తం ఏమీ కాదని అంటున్నారు అభిమానులు.
రిజిస్ట్రేషన్లు షురూ
కాగా... మీలో ఎవరు కోటీశ్వరు 4వ సీజన్లో అవకాశం దక్కించుకోవాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా చిరంజీవి అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సరైన సమాధానం చెబితే....ఈ కార్యక్రమం ఎంపిక ప్రక్రియలో మీరు ఒక మెట్టు ఎక్కినట్లు అవుతుంది. దసరా సందర్భంగా ఆల్రెడీ మొదటి ప్రశ్నను రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకున్నారు.