Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్లోకి హీరోగా యశ్వంత్ మాస్టర్: బడా నిర్మాత మాస్టర్ ప్లాన్.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా!
తెలుగు బుల్లితెరపై వచ్చే వాటిలో 'ఢీ' డ్యాన్స్ షో ఒకటి. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ షో.. ఇప్పటికీ ప్రసారం అవుతూనే ఉంది. చాలా కాలంగా తన ముద్రను చూపిస్తూ దక్షిణాదిలోనే నెంబర్ వన్ డ్యాన్స్ రియాలిటీగా వెలుగొందుతోంది. ఈ కారణంగానే ఇప్పటికే ఏకంగా 12 సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇటీవలే 13వ సీజన్ను సైతం ప్రారంభించారు. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో యశ్వంత్ మాస్టర్ ఒకడు. ఇన్ని రోజులు డ్యాన్సర్గా మెప్పించిన అతడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ వివరాలు మీకోసం!
డ్యాన్సర్ నుంచి మాస్టర్ స్థాయికి ఎదిగాడు
డ్యాన్సర్ అవ్వాలన్న లక్ష్యంతో నాట్యంలో శిక్షణ తీసుకున్నాడు యశ్వంత్. ఈ క్రమంలోనే తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో పలువురు మాస్టర్ల దగ్గర గ్రూప్ బాయ్గా పని చేశాడు. ఆ సమయంలోనే చక్కగా రాణిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఈ యంగ్ టాలెంటెడ్ డ్యాన్సర్కు షో నిర్వహకులు మాస్టర్గా ప్రమోషన్ ఇచ్చి ప్రోత్సహించారు.
మూడు సార్లు టైటిల్ కొట్టిన ఏకైక మాస్టర్
'ఢీ' జూనియర్స్ సీజన్ ప్రసారం అయిన సమయంలో శివమణి ద్వారా ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన యశ్వంత్ మాస్టర్.. అప్పుడే మొదటి టైటిల్ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత 'ఢీ జోడీ'లో సంకేత్ అండ్ ప్రియాంకకు కొరియోగ్రఫీ చేసి వాళ్లను గెలిపించాడు. ఇక, ఇటీవల ముగిసిన 'ఢీ ఛాంపియన్స్' సీజన్లో పియూష్ను గెలిపించాడు. తద్వారా మూడు టైటిళ్లు కొట్టిన మాస్టర్గా నిలిచాడు.
సినిమాల్లోనూ ఎంటర్... సమంత పాటతో
'ఢీ' షో ద్వారా విశేషమైన గుర్తింపును ఫ్యాన్ ఫాలోయింగ్ను అందుకున్నాడు యశ్వంత్. ఈ క్రమంలోనే కొన్ని చిన్న చిన్న సినిమాలకు కొరియోగ్రాఫర్గానూ పని చేశాడు. అయితే, అతడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ, సమంత హీరోయిన్గా చేసిన 'యూటర్న్'తో చేసిన థీమ్ సాంగ్తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత 'చిత్రలహరి', 'బంగారు బుల్లోడు' సహా పలు చిత్రాలకు పని చేశాడు.
Recommended Video
మాస్టర్ నుంచి జడ్జ్గా మారిన యశ్వంత్
డ్యాన్సర్గా, మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా సత్తా చాటాడు యశ్వంత్. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'డ్యాన్స్+' అనే షోతో జడ్జ్గా కొత్త అవతారం ఎత్తాడు. ప్రముఖ డైరెక్టర్ ఓంకార్ నిర్వహిస్తున్న ఈ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇందులో యశ్వంత్ భార్య కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తోంది. దీంతో అతడు ప్రతి ఎపిసోడ్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు.
టాలీవుడ్లోకి హీరోగా యశ్వంత్ మాస్టర్
ఇన్ని రోజులూ స్క్రీన్ వెనుకాలే ఉండి పని చేసిన యశ్వంత్ మాస్టర్.. త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అతడు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయని, ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.
బడా నిర్మాత మాస్టర్ ప్లాన్.. లక్కీ ఛాన్స్
ఇక, యశ్వంత్ మాస్టర్ను పరిచయం చేయబోయేది టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అని సమాచారం. ఇప్పటికే ఎంతో మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు ఇతడితో సినిమా చేస్తున్నాడట. మొదటి సినిమానే అయినప్పటికీ యశ్వంత్ను గ్రాండ్గా లాంఛ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం పేరున్న దర్శకుడినే ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.