Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్లాన్ చేంజ్ చేసిన డైరెక్టర్ తేజ.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..
సీనియర్ డైరెక్టర్ తేజ ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో ఎలాంటి విజయాలను అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వరుస అపజయాల అనంతరం తేజ తన ట్రాక్ ను చేంజ్ చేసి నేనే రాజు నేనే మంత్రి సినిమాను చేశాడు. ఇక ఆ సినిమా హిట్ తరువాత ఫామ్ లోకి వచ్చిన తేజ వెంటనే రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లే పెట్టి పూర్తి చేయకుండానే తప్పుకోవాల్సి వచ్చింది.
బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కోసం మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ ఆ తరువాత నేనే చేయలేను అంటూ తప్పుకున్నాడు. ఇక వెంకటేష్ తో కూడా ఒక పవర్ఫుల్ సినిమాను లైన్ లో పెట్టినట్లే పెట్టి అపెయ్యాల్సి వచ్చింది. ఇక ఆ మధ్య సీత అనే సినిమా చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక ఫైనల్ గా గోపిచంద్, రానాలతో సినిమాలు చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసిన తేజ లాక్ డౌన్ అనంతరం ముందు ఏది కుదిరితే అది చేయాలని అనుకున్నాడు.
అయితే రానా సినిమా సంగతి ఏమిటో గాని గోపీచంద్ తో చేయాల్సిన సినిమాను తేజ పక్కన పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక రానాతో ముందు అనుకున్న సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు మరొక టాక్ వస్తోంది. గోపిచంద్ ను ఇండస్ట్రీకి విలన్ గా పరిచయం చేసింది తేజనే. జయం, నిజం సినిమాల్లో గోపిచంద్ విలన్ పాత్రలకు అప్పట్లో మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత హీరోగా ట్రై చేసి గోపిచంద్ ఒక ట్రాక్ లోకి వచ్చాడు. మరి తేజ సినిమాపై వస్తున్న రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.