దీపావళి దమాకాలో సెవెన్త్ సూపర్...రా.వన్ ఓవర్...!?

ఇక సూర్య హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సెవన్త్ సెన్స్" భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించగా సాంకేతికంగా, కమర్షియల్గా మంచి మార్కులే వేయించుకుంది. దానికితోడు సూర్య, శృతిహాసన్ల జంట ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓవరాల్గా సెవన్త్ సెన్స్ సేఫ్ ప్రాజెక్ట్గా నిలచి బయ్యర్లకు లాభాల పంటనార్జించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇక బాలీవుడ్ బాద్షా నటించిన రూ.170 కోట్ల బడ్జెట్గా చెప్పుకున్న 'రా..వన్" చిత్రాన్ని అంతా ఓ వీడియో గేమ్లానే భావిస్తున్నారు. చిత్రం కథాంశం కూడా వీడియోగేమ్ లో ఉండే విలన్ బయట ప్రపంచానికి వచ్చి హాని తలపెడుతుంటే హీరో ఆ విలన్ ని అంతమొందించే సిల్లీ పాయింట్తో చిత్ర కథ, స్క్రీన్ ప్లే నడపడంతో కొంతమంది ప్రేక్షకులకు రుచించడంలేదని తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఖర్చుపెట్టేటప్పుడు అందులో ఉండే కథ, కథనం కూడా అదే రేంజ్లో ఉంటే బాగుండేది. ఖర్చు విషయంలో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టేటప్పుడు కనీసం నిర్మాణాత్మక కథ ఉండాలనే ప్రాధమిక విషయాలను మర్చిపోవడం వల్లే సినిమాలకు నష్టం చేకూరుతోంది.
సినిమాలలో విషయం తక్కువ ఉన్నా పోనీ షారూక్ తన హవాతో బయటపడేస్తాడనే భరోసా కూడా లేదు. ఒకప్పటి బాలీవుడ్ బాద్ షాకు ఇప్పుడు చాలా ఎక్కువగా గ్యాప్ రావడం పెద్ద మైనస్ కింద మారింది. ఇక ఈ చిత్రం వసూళ్లు ఏం రేంజ్లో ఉంటాయనేది మరో వారం రోజులు గడిస్తేగానీ చెప్పలేని పరిస్థితి. తొలిరోజు దీపావళి కావడంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన 3,500 సెంటర్ల నుంచి దాదాపు రూ.22 కోట్లు వసూళ్లు చేసింది. అయితే ఈ కలెక్షన్లు కంటిన్యూ అవుతాయా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ లానే భావిస్తే ఇక సినిమా కలెక్షన్లు పడిపోవడం ఖాయం అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











