Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఏ మాయ చేసావే నిర్మాత మంజుల ఓ మోసగత్తె: గౌతమ్ మీనన్..!!
నాగ చైతన్య, సమంత నాయికానాయకులుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మంజుల నిర్మించిన చిత్రం ఏ మాయ చేసావే. గత శుక్రవారం విడుదలయిన ఈ చిత్రం తర్వాత గౌతమ్ మీనన్ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే మహేష్ బాబు నాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్టు మంజుళ ప్రకటించింది. కానీ ఇప్పుడా సినిమాను చెయ్యబోనని గౌతమ్ ప్రకటించాడు. డబ్బు విషయంలో మంజుళ తనని మోసం చేసిందని సంచలన ప్రకటన చేసాడు.
సినిమా ప్రారంభానికి ముందు మంజుళ గౌతమ్ కు పారితోషికంతో పాటు లాభాల్లో 50% ఇస్తానని మాట ఇచ్చిందట. ఈ మేరకు ఆయనకు 3 కోట్ల రూపాయలు ముట్టజెప్పిందట. తీరా సినిమా విడుదల ఆలస్యం అవడంతో 3 కోట్లలో కొంత మొత్తం తనకు తిరిగి ఇవ్వాలని మంజుళ అడిగిందట. ఈ మేరకు నిర్మాత మండలిలో ఫిర్యాదు కూడా చేసిందట. ఈ వివాదంతో మనస్తాపం చెందిన గౌతమ్ తాను 1.6 కోట్లను వెనక్కు ఇచ్చేస్తున్నానని, కానీ తాను కేవలం 55 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తే మార్కెట్ చేసుకోవడంలో విఫలం అయిన ఆమె తిరిగి డబ్బు అడగటం తనని బాధించిందని, అందుకే మంజుళ, మహేష్ ల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాను చెయ్యడం లేదని ప్రకటించాడు.