Don't Miss!
- News మెగాస్టార్ అనూహ్య నిర్ణయం
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
'గోవిందుడు అందరివాడేలే' టీజర్ విడుదల తేదీ
హైదరాబాద్ : రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ చిత్రం టీజర్ రెడీ అయ్యిందని, అది అద్బుతంగా వచ్చిందని ఇప్పటికే బండ్లగణేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులను ఊరిస్తున్నారు. ఇంతకీ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే... చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ..." ఇప్పుడే గోవిందుడు అందరి వాడేలా ట్రైలర్ చూసాను. సూపర్బ్... మా గోవిందుడు ఇన్ని రంగుల మధ్య అన్ని హంగులతో చూస్తూంటే దసరా కే దసరా పండుగ " అన్నారు. ఈ ట్రైలర్ దసరా కి విడుదల చేయటానికి ముస్తాబు చేస్తున్నారన్నమాట. రామ్చరణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''గోవిందుడు అందరివాడేలే' విషయంలో ఇటీవల అనేక వదంతులు వినవస్తున్నాయి. ఇది నాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సినిమా. కుటుంబ విలువలతో తెరకెక్కుతున్న అచ్చ తెలుగు చిత్రం. పది తరాల వారు గుర్తుంచుకునేలా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేస్తున్నాం. ఈ క్రమంలో సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రామ్చరణ్ తాత పాత్ర పోషించిన రాజ్కిరణ్ను మార్చాల్సి వచ్చింది '' అన్నారు.
అలాగే రాజ్ కిరణ్ తమిళ నటుడు కావడంతో నేటివిటీ సమస్య రాకుండా ఆయన స్థానంలో ప్రకాష్రాజ్ను ఎంపిక చేసుకున్నాం. దీని కోసం రాజ్కిరణ్గారికి క్షమాపణలు చెప్తున్నాను. ఇటీవల రామ్చరణ్ జ్వరంతో బాధపడటం, మండుటెండల్లో కళాకారుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోవడం.. వంటి కారణాలతో కొద్ది రోజులు చిత్రీకరణ నిలిపేశాం. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ మొదలైంది.ఈ నెల 31 వరకు హైదరాబాద్లోనే చిత్రీకరణ ఉంటుంది '' అన్నారు.
ఇక ఆగస్టు 1-15 మధ్య లండన్లో చిత్రీకరణ జరు పుతాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. అక్టోబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాం'' అన్నారు. శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.