Just In
- 2 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 2 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 3 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 4 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
వామ్మో.. హీరో కూడానా... తక్కువ ధరకు కార్లు అంటూ మోసం.. కేసు నమోదు..
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఊపిరి’ దర్శక నిర్మాతలు అతన్ని మోసం చేసారా?
హైదరాబాద్: నాగార్జున-కార్తి ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమాస్ వారు తెరకెక్కించిన 'ఊపిరి' సినిమా గురించి ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఊపిరి దర్శక నిర్మాతలు ఓ నటుడిని మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన రాజారవీంద్ర అందరికీ సుపరిచితమే. రాజా రవీంద్ర 'ఊపిరి' టైటిల్ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. 'ఊపిరి' టైటిల్ తమకు ఇచ్చినట్టయితే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తామని అతగాడికి ఆశ పెట్టినట్లు సమాచారం.
నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా కావడంతో 'ఊపిరి' సినిమా టైటిల్ వారికి ఎలాంటి డబ్బు తీసుకోకుండా వారికి ఇచ్చేసాడు. వారు చెప్పినట్లే రాజారవీంద్రకి సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అదీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. సినిమాలో ఆయన కనిపించేది ఒక్క నిమిషం కూడా ఉండదు, ఆయన పాత్రకు ఉన్న డైలాగ్ కూడా ఒకే ఒక్కటి.

దీంతో రాజారవీంద్ర తన సన్నిహితుల వద్ద ఈ విషయమై చాలా బాధపుతున్నట్లు సమాచారం. ఒకరకంగా తాను మోస పోయానని, తనకు సినిమాలో మంచి పాత్ర వస్తుందని ఆశించాను. కానీ అలా జరుగలేదు అంటూ బాధ పడుతున్నాడట.
'ఊపిరి' సినిమా విషయానికొస్తే.... విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రం ఆల్రెడీ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది.