‘ఊపిరి’ దర్శక నిర్మాతలు అతన్ని మోసం చేసారా?

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున-కార్తి ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమాస్ వారు తెరకెక్కించిన 'ఊపిరి' సినిమా గురించి ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఊపిరి దర్శక నిర్మాతలు ఓ నటుడిని మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన రాజారవీంద్ర అందరికీ సుపరిచితమే. రాజా రవీంద్ర 'ఊపిరి' టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్‌ చేసి పెట్టుకున్నాడు. 'ఊపిరి' టైటిల్‌ తమకు ఇచ్చినట్టయితే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తామని అతగాడికి ఆశ పెట్టినట్లు సమాచారం.

నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా కావడంతో 'ఊపిరి' సినిమా టైటిల్ వారికి ఎలాంటి డబ్బు తీసుకోకుండా వారికి ఇచ్చేసాడు. వారు చెప్పినట్లే రాజారవీంద్రకి సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అదీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. సినిమాలో ఆయన కనిపించేది ఒక్క నిమిషం కూడా ఉండదు, ఆయన పాత్రకు ఉన్న డైలాగ్ కూడా ఒకే ఒక్కటి.

Is Oopiri Team Cheated Raja Ravindra?

దీంతో రాజారవీంద్ర తన సన్నిహితుల వద్ద ఈ విషయమై చాలా బాధపుతున్నట్లు సమాచారం. ఒకరకంగా తాను మోస పోయానని, తనకు సినిమాలో మంచి పాత్ర వస్తుందని ఆశించాను. కానీ అలా జరుగలేదు అంటూ బాధ పడుతున్నాడట.

'ఊపిరి' సినిమా విషయానికొస్తే.... విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రం ఆల్రెడీ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X