Samantha: అమ్మ తనాన్ని తొలగించుకున్న సమంత?.. రెండో పెళ్లికి ఫోర్స్ చేయడంతో!
సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత లైఫ్ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగానే పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. అలాంటిది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుస సినిమాలు చేసి, అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకున్న నటి ఎవరైనా ఉంటే అది సమంతనే అని చెప్పవచ్చు. అయితే ఈ సమంత గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. ఎందుకు?

నాలుగేళ్ల తర్వాత..
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జోడిగా నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా వారిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం వీరిద్దరు కలిసి అటో నగర్ సూర్య, మనం, మజిలి వంటి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్గా రికార్డుకెక్కారు. ఆన్స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్లో సైతం బ్యూటిఫుల్ కపుల్గా అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత సడెన్గా సినీ లోకానికి షాక్ ఇచ్చారు.

దీటుగా కౌంటర్లు..
అక్టోబర్ 2, 2021 తాము విడిపోతున్నట్లు ప్రకటించి నాగ చైతన్య, సమంత ప్రేక్షక లోకాన్ని షాక్కు గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కవగా అందరూ సమంతను టార్గెట్ చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి దీటుగా కౌంటర్ ఇవ్వడం వంటివి చాలానే జరిగాయి. సమంత రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వంటి రూమర్లు చాలా వచ్చాయి. వాటిపై కాఫీ విత్ కరణ్ టాక్ షోలో క్లారిటీ కూడా ఇచ్చింది సామ్.

వివిధ రకాలుగా పోస్ట్లు..
సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్గా ఉండేది. అప్పటినుంచి ఆమె ఏ పోస్ట్ పెట్టిన, ఎలాంటి కామెంట్ చేసిన వెంటనే వైరల్ అయిపోయేది. తను వెళ్లే టూర్లు, వెకేషన్స్, మోటివేషనల్ కొటేషన్స్, ఫిట్నెస్ తదితర విషయాలపై పోస్ట్లు, వీడియోలు పోస్ట్ చేసేది సమంత. అలాంటి సామ్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది.

సైలెంట్ అయిన సామ్..
ఆమెకు సంబంధించిన టాక్ ఏం బయట వినిపించడం లేదు. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్లు గానీ పెట్టట్లేదు. ఇప్పుడు సామ్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన న్యూసే.. పెట్టకున్న వార్తే అన్నట్లుగా మారింది. అలాంటిది సుమారు 25 రోజులుగా సోషల్ మీడియాలో సమంత యాక్టివ్గా లేదు. అందుకు కారణం ఏంటని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఇందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ బడా హీరోనే?
సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ఒక బాలీవుడ్ హీరో కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్కు చెందిన ఓ బడా హీరోనే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండమని సామ్కు సలహా ఇచ్చాడని టాక్ నడుస్తోంది. మరీ ఆ హీరో ఎవరనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక ఇది కాకుండా సామ్ సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడానికి మరో కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.

అమ్మతనానికి దూరంగా!
సమంత తన గర్భసంచి తీయించేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంట్లో వాళ్లు తనను రెండో పెళ్లికి ఫోర్స్ చేస్తున్నారన్న కారణంతో ఈ పని చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తను అమ్మతనానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. అందుకే సామ్ గత కొంతకాలంగా సైలెంట్గా ఉండిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

పాన్ ఇండియా చిత్రాలతో..
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. సామ్ వరుసగా పాన్ ఇండియా మూవీస్తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తోంది సామ్. ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అలాగే హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్, తాప్సీ ప్రొడక్షన్లో పలు చిత్రాలకు ఓకే చెప్పిందని సమాచారం. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీకి సామ్ పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











