Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
SSMB29 హాలీవుడ్ బాక్సాఫీస్పై రాజమౌళి భారీ గురి.. మహేష్ బాబు మూవీకి ఎన్నివేల కోట్ల టార్గెట్ అంటే?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ అవార్డు కోసం RRR సినిమాను ప్రపంచ సినీ దిగ్గజాలకు చేరువ చేయడంలో తన ప్రత్యేకతను నిలుపుకొన్నాడు. అంతర్జాతీయ సినిమా వేదికలపై తెలుగు సినిమా సత్తాను చాటడంలో జక్కన్న సఫలమయ్యాడు.
ఒకవైపు RRR సినిమాతో హాలీవుడ్లో తన అస్థిత్వాన్ని స్థిరపరుచుకోవడంతోపాటు మహేష్ బాబుతో తన తదుపరి సినిమా మార్కెట్కు మార్గాన్ని సుగమం చేసుకొనే ప్లాన్ను కూడా అంతర్లీనంగా అమలు చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అయితే సోషల్ మీడియాలో మహేష్ బాబుతో రూపొందించబోయే సినిమా గురించి హైప్ ఏ విధంగా ఉందంటే...
జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్తో
RRR సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడానికి అమెరికాలో రాజమౌళి టీమ్ విశేషంగా కృషి చేస్తున్నది. ఆస్కార్ అవార్డును ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో తన సినిమాను స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి సినీ దిగ్గజాలకు ప్రదర్శించిన విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ను జక్కన కలిసిన ఫోటోలు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి.
ట్రెండింగ్గా SSMB29
హాలీవుడ్లో RRR సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందనే విషయాన్ని అవసరమైన చోట రాజమౌళి చెబుతున్నారు. ఇండియాలో మహేష్ బాబు సూపర్ స్టార్ మాత్రమే కాకుండా బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరో అంటూ అంతర్జాతీయ మీడియాకు వెల్లడిస్తున్నారు. దాంతో మహేష్ బాబు SSMB29 సినిమా ఇప్పటికే ట్రెండ్ అవుతున్నది.
నా నెక్స్ సినిమా మహేష్ బాబుతోనే
ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొన్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో నా సోదరుడు రాజమౌళి రూపొందించే చిత్రమే తన తదుపరి సినిమా. ఈ సినిమా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హలీవుడ్ మీడియాకు కీరవాణి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాకుండా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా కీరవాణి కృషి చేయడం అభిమానులను ఆకట్టుకొంటున్నది.
ఇండియానా జోన్స్ రేంజ్లో
ఎస్ఎస్
రాజమౌళి,
మహేష్
బాబు
కాంబినేషన్లో
ప్రారంభమయ్యే
సినిమా
కోసం
రచయిత
విజయేంద్ర
ప్రసాద్
ఇప్పటికే
కసరత్తు
ప్రారంభించారు.
అయితే
ఈ
సినిమా
ప్రాంచైజీగా
రూపొందించేందుకు
సిద్దమవుతున్నారు.
ఇండియానా
జోన్స్
సినిమాను
తలపించేలా
భారీ
అడ్వంచర్
సినిమాను
రూపొందించే
పనిలో
పడ్డారు.
SSMB29 సినిమాకు సీక్వెల్ ప్లానింగ్
మహేష్
బాబు,
జక్కన
కాంబినేషన్లో
వచ్చే
SSMB29
సినిమాకు
సీక్వెల్
కూడా
ఉంటుంది.
క్యారెక్టర్
ఏమీ
మారకుండా
స్టోరీలో
సెంట్రల్
థీమ్లో
మార్పులు
ఉంటాయి.
పక్కా
అడ్వెంచర్
థ్రిల్లర్.
ఈ
సినిమా
వచ్చే
ఏడాదిలో
ప్రారంభం
అవుతుంది
అని
రచయిత
విజయేంద్ర
ప్రసాద్
తెలిపారు.
ఫిబ్రవరి
నుంచి
ప్రీ
ప్రొడక్షన్
పనులు
ప్రారంభం
అవుతాయని
తెలిపారు.
1 బిలియన్ డాలర్లు టార్గెట్గా
RRR
సినిమా
ముఖ్యంగా
రాజమౌళి
ఇప్పటికే
హాలీవుడ్లో
భారీగా
టార్గెట్
ఆడియెన్స్ను
సంపాదించుకొన్నారు.
పలు
దేశాల్లో
రాజమౌళి
గురించి
మరింత
పాపులారిటీ
లభించింది.
దాంతో
రాజమౌళి
సినిమాపై
ఇప్పటి
నుంచే
మార్కెటింగ్,
పబ్లిసిటీ
మొదలైంది.
ఈ
సినిమా
ద్వారా
ప్రపంచ
బాక్సాఫీస్
వద్ద
కనీసం
1
బిలియన్
డాలర్లను
కొల్లగొట్టేందుకు
జక్కన్న
భారీ
ప్లాన్
చేస్తున్నట్టు
సమాచారం.