Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్తో జగపతిబాబు ఫైట్.. బయటపడ్డ ఆసక్తికర విషయం!
ప్రభాస్ నటించిన 'సాహో' ఆశించిన మేర ఫలితం రాబట్టలేదు. దీంతో తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు రాధాకృష్ణ దర్శకత్వంలో కమిటైన కొత్త సినిమా సెట్స్పై చురుకుగా కదులుతున్నారు. హై రేంజ్ బడ్జెట్తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం.
ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా అలరించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తాజాగా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. విలన్గా కీలక పాత్ర పోషించనున్న ఆయన.. ప్రభాస్తో బిగ్ ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది.
గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం.