Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ కు కోపం వెళ్లిపోబోయాడు, కానీ సమంత సారి చెప్పి...
హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకూ బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస,జనతాగ్యారేజ్ అంటూ నాలుగు చిత్రాలు వచ్చాయి. దాంతో వారిద్దరి మధ్యా మంచి అనుబంధమే ఉంది. తాజాగా వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం ప్రమోషన్స్ లో మాత్రం సమంత ఎన్టీఆర్ కు కోపం తెప్చించింది. అయితే ఎన్టీఆర్ కు ఎందుకు కోపం వచ్చిందంటారా...అయితే ఈ కథనం చదవండి.
జనతాగ్యారేజ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఇదే పనిలో ఓ టీవి ఛానెల్ లైవ్ ఇంటర్వూకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ కు సమంత కోపం తెప్పించింది. ఎందుకంటే సమంత చాలా లేటుగా వచ్చింది. ఈ ఇంటర్వూ సమంత, కొరటాల, ఎన్టీఆర్ తో కలిసి చేసారు.
లైవ్ షో కు సమయానికి ముందే ఎన్టీఆర్, కొరటాల వచ్చారచు. కానీ వీళ్లిద్దరూ వచ్చిన నలభై ఐదు నిముషాలకు గానీ సమంత రాలేదు. సమంత కోసం దాదాపు నలభై నిముషాలకు పైగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ ,...విసుగెత్తి ఓపిక నశించడంతో ఎన్టీఆర్ లేచి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ గా అప్పుడే
సమంత వచ్చింది.
ఇక సమంత ను చూసిన వెంటనే ఎన్టీఆర్ కోపం వచ్చింది. ఆమెపై కోపంగా ఫైర్ అవ్వబోయారు. లేచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈలోగా విషయం గమనించిన సమంత వెంటనే సారి చెప్పింది. అంతేకాకుండా తన లేటుకు కారణం చెప్పింది. ఆ కారణం చెప్పిన వెంటనే ఎన్టీఆర్ కూల్ అయ్యారు.
సమంత చెప్పిన విషయం ఏమిటి అంటే...తాను ఓ ఛారిటి పోగ్రామ్ కు వెళ్లటం వెల్లనే లేట్ అయ్యిందని సమంత చెప్పింది. దాంతో ఎన్టీఆర్ కూల్ అయ్యి..ఆమెను మెచ్చుకుని ఇంటర్వూలో కూర్చున్నట్లు తెలిసింది. అదీ విషయం.