Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కళ్యాణ్ రామ్ 'ఓం' విడుదల తేదీ మారిందా?
హైదరాబాద్: 'అతనొక్కడే' చిత్రంతో హీరోగా తన సత్తా చూపించి, 'హరేరామ్' సినిమా విజయంతో మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యారు నందమూరి కల్యాణ్రామ్. ఆయన తాజాగా తను హీరోగా నటిస్తూ నిర్మించిన 3డి స్టీరియోఫోనిక్ సినిమా 'ఓం' . ఈ చిత్రం ఈ నెల 28 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల వచ్చే నెల 19 కి వాయిదా పడిందని సమాచారం.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..."ఉత్తేజాన్నిచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. భారతదేశపు తొలి యాక్షన్ 3డి చిత్రమిది. విజయ్, రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాల్ని 3డిలో చూడటం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తాయి. విదేశాల నుంచి ప్రత్యేకంగా కెమెరాలు, లెన్స్లు తెప్పించాం. ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాలు మూలంగా ఎలా మారాడు, ఎవరిపై విజయం సాధించాలని తపించాడు అన్నది చిత్రంలో ముఖ్యాంశం. 3డి, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన పనులు విదేళాల్లో చేశాం. ' అని తెలిపారు.
అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశారు. స్టెప్ అప్3, ఫైనల్ డెస్టినేషన్, స్పైడర్మేన్4, అవతార్, రెసిడెంట్ ఈవిల్ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్ ఎపిక్, త్రీడీ రిగ్ కెమెరాలు, లెన్స్లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్ల్లో త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి.
ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ సునీల్రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికిషా పటేల్ హీరోయిన్లు. యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అచ్చు, సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.