twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే దెబ్బకి రెండు పిట్టలు.... ‘విశ్వరూపం-2’ కూడా రెడీ అయిందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం'చిత్రంపై తమిళనాడులో బ్యాన్ తదితర గొడవలను పక్కన పెడితే.....ఈ చిత్రం ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో రిలీజై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ 'విశ్వరూపం-2' కూడా ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు కమల్ హాసన్.

    తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వరూపం చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో రూపొందిన కమల్ హాసన్ 'విశ్వరూపం-2' పార్టును కూడా ఇదే బడ్జెట్ లో మాగ్జిమమ్ పూర్తి చేసాడట. విశ్వరూపం సినిమా మొత్తం ఆప్ఘనిస్థాన్, అమెరికాల్లో చిత్రీకరించారు.

    దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం విశ్వరూపంతో పాటు విశ్వరూపం-2 చిత్రానికి సంబంధించిన సీన్లను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ మేరకు ఈ చిత్ర నటీనటులతో కూడా ముందే ఒప్పందం కుదుర్చుకున్నాడట. మరికొంత భాగం ఇండియాలో చిత్రీకరిస్తే 'విశ్వరూపం-2' చిత్రం పూర్తవుతుందని, భారీ లాభాలు ఆర్జించడంలో భాగంగానే ఒక బిజినెస్ మేన్ లా ఆలోచించి కమల్ హాసన్ ఇలా చేసాడని అంటున్నారు.

    విశ్వరూపం చిత్రం విడుదలై హిట్టయిన తర్వాత 'విశ్వరూపం-2'కు బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ను షూట్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు కమల్. అయితే అనుకోని విధంగా 'విశ్వరూపం' చిత్రం వివాదాల్లో చిక్కుకుని తమిళనాడుతో పాటు కొన్ని చోట్ల విడుదలకు నోచుకోలేదు.

    English summary
    Chennai source said that ‘Vishwaroopam’ as we know it is a very heavily edited version of a much larger film that Kamal Haasan made. We have been told that there is an extra 90 – 100 minutes of the film which has been kept aside for a sequel. This part will now be used for ‘Vishwaroopam 2′ and Kamal will need to shoot just a few more sequences to add another 20 – 25 mins to the footage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X