Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్ఫ్రెండ్కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒకే దెబ్బకి రెండు పిట్టలు.... ‘విశ్వరూపం-2’ కూడా రెడీ అయిందా?
హైదరాబాద్ : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం'చిత్రంపై తమిళనాడులో బ్యాన్ తదితర గొడవలను పక్కన పెడితే.....ఈ చిత్రం ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో రిలీజై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ 'విశ్వరూపం-2' కూడా ఉంటుందని సినిమా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు కమల్ హాసన్.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వరూపం చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో రూపొందిన కమల్ హాసన్ 'విశ్వరూపం-2' పార్టును కూడా ఇదే బడ్జెట్ లో మాగ్జిమమ్ పూర్తి చేసాడట. విశ్వరూపం సినిమా మొత్తం ఆప్ఘనిస్థాన్, అమెరికాల్లో చిత్రీకరించారు.
దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం విశ్వరూపంతో పాటు విశ్వరూపం-2 చిత్రానికి సంబంధించిన సీన్లను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ మేరకు ఈ చిత్ర నటీనటులతో కూడా ముందే ఒప్పందం కుదుర్చుకున్నాడట. మరికొంత భాగం ఇండియాలో చిత్రీకరిస్తే 'విశ్వరూపం-2' చిత్రం పూర్తవుతుందని, భారీ లాభాలు ఆర్జించడంలో భాగంగానే ఒక బిజినెస్ మేన్ లా ఆలోచించి కమల్ హాసన్ ఇలా చేసాడని అంటున్నారు.
విశ్వరూపం చిత్రం విడుదలై హిట్టయిన తర్వాత 'విశ్వరూపం-2'కు బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ను షూట్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు కమల్. అయితే అనుకోని విధంగా 'విశ్వరూపం' చిత్రం వివాదాల్లో చిక్కుకుని తమిళనాడుతో పాటు కొన్ని చోట్ల విడుదలకు నోచుకోలేదు.