Just In
- 3 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 4 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్తో రెచ్చిపోయిన శ్రియ
- 6 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి మెగా హీరోతో జోడీ కట్టనున్న బాలీవుడ్ బ్యూటీ
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్ తేజ్.. ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్తో ప్రేక్షకులను పలకరించిన వరుణ్.. వాల్మీకిగా మరోసారి ఆడియెన్స్ను మెప్పించాడు. మెగా హీరోలందరిలోనూ తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వాల్మీకి ఇచ్చిన ఊపులో కొత్త ప్రాజెక్ట్లను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇటీవలె బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఓ చిత్రాన్ని ప్రారంభించేశాడు.
ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచిన కియారా అద్వాణీ వరుణ్ తేజ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వాణీ బాలీవుడ్ అందాల తారగా ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే, 'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ బాక్సింగ్ నేపథ్యంలో సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ మూవీ కోసం వరుణ్ శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.