Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘డిక్టేటర్’ బిజినెస్... కోన వెంకట్ భయం ?
హైదరాబాద్ : సినిమా పరిశ్రమ రకరకాల సెంటిమెంట్స్, భయాలతో రన్ అవుతూంటుంది. కోట్లతో నడిచే వ్యాపారం కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్ధితి తలక్రిందులు అవుతుంది కాబట్టి అలాంటివి తప్పదంటూంటారు. అయితే ఒక్కోసారి కొన్ని చిత్రంగా అనిపిస్తూంటాయి. తాజాగ బాలకృష్ణ చిత్రం డిక్టేటర్ బిజినెస్ పై కోన వెంకట్ ప్రభావం పడిందనే వార్తలు సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి కోనవెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడం ఈ చిత్ర జిజినెస్ విషయంలో మైనస్ గా మారిందని అంటున్నారు. ఈ చిత్రం విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు కోనవెంకట్ భయం పట్టుకుందని, .మొదట్లో ఈ చిత్ర పంపిణీ హక్కులను ఫ్యాన్సీ రేట్లకు ఆఫర్ ఇచ్చిన డిస్థిబ్యూటర్స్ ఇటీవల కోన పనిచేసిన బ్రూస్లీ, అఖిల్, త్రిపుర, శంకరాభరణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలుగా నిలవడంతో డిక్లేటర్ బిజినెస్ విషయంలో మళ్ళీ బేరాలు మొదలుపెట్టారని చెప్పుకుంటున్నారు.
దానికి తోడు బాలకృష్ణ ముందు చిత్రం 'లయన్ కూడా ఫెయిల్యూర్ కావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందు ఒప్పందం చేసుకున్న రేట్ల ప్రకారం కూడా తగ్గించమని అడుగుతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాత, దర్శకుడు శ్రీవాస్ మాత్రం ఇందుకు ససేమీరా ఒప్పుకోవడం లేదని వినికిడి. అయితే ఇందులో ఎంత వరకూ నిజముందో తేలాలి. లేక కావాలని పుట్టించిన రూమరా అని అభిమానులు ఆలోచనలో పడుతున్నారు.
సినిమా విషయానికి వస్తే..
దర్శకుడు మాట్లాడుతూ... రక్తం చిందించేవాడు.. సైనికుడు! తన అనుచరుల్లో రక్తం పొంగించేవాడే నాయకుడు. త్యాగానికి, యుద్ధానికి ముందుండేవాడే.. అసలు సిసలైన పోరాట యోధుడు. అలాంటి ధీరోదాత్తుణ్ని మా సినిమాలోనూ చూడొచ్చు అంటున్నారు శ్రీవాస్.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 20న అమరావతిలో విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వీటికి రవివర్మ నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.