twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో 20 నిముషాలు కట్?

    By Srikanya
    |

    హైదరాబాద్ : రానా,దర్శకుడు క్రిష్ ల తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. మైనింగ్ మాఫియా బేస్ గా నిర్మితమైన ఈ చిత్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాల పాటు సెన్సార్ కట్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఓ రాజకీయ పార్టీని ...ఈ మైనింగ్ మాఫియా రిఫెర్ చేస్తూండటంతో ఈ కట్స్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇవన్నీ దేనికైనా రెడీ, కెమెరామెన్ గంగతో ఎఫెక్టు అంటున్నారు. ఈ రెండు చిత్రాలు వివాదం క్రియేట్ చేయటంతో సెన్సార్ చాలా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఈ కట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సినిమా చాలా బాగా వచ్చిందని, గ్యారెంటీగా మంచి సక్సెస్ సాధిస్తుందని చెప్తున్నారు.

    రానా, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి సోమవారం సెన్సార్ పూర్తయింది. యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే విడుదల తేదీ ఈ నెల 30 కి మారే అవకాసం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ -''భగవద్గీతలోని సారానికి వెండితెర రూపమే ఈ సినిమా. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్య చుట్టూ కథ తిరుగుతుంది.

    యాక్షన్ అడ్వంచరస్ మూవీ ఇది. కమర్షియల్‌గా అటు రానాకు, ఇటు నాకూ మంచి బ్రేక్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ఇప్పటికే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి. మణిశర్మ రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ'' అని తెలిపారు.

    ''దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే మత్స్యావతారం అన్నారు. ఓ పంది సాయం చేస్తే వరాహమూర్తీ.. మహావిష్ణు అవతారం అన్నారు. రాత రాసింది దేవుడు గురించి కాదు. సాయం గురించి''... ఈ ఒక్క డైలాగే 'కృష్ణం వందే జగద్గురుమ్'. భగవానుడు ఎక్కడో ఉండడు. మనం అందించే చేయూతలోనే ఉంటాడనే పాయింట్‌తో జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) అందిస్తున్న సందేశాత్మక ఈ సినిమా ఇది.

    ఈ చిత్రంలో రానా పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ.

    English summary
    Censor scissors have got sharp suddenly. Sources say 'Krishnam Vande Jagadgurum' which will be released shortly is facing severe problem due to Censor new implementation. The film deals with mining mafia and refers to a particular party in the film. The buzz is that the cuts on this film have been so severe that almost 18 minutes of the film has been chomped off.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X