Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఐపీఎల్ టీం కొనుగోలు చేయబోతున్న మహేష్ బాబు?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలకే పరిమితం అయ్యారు. తాజాగా ఆయన మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా భారత్ లో అత్యంత ఆదరణ పొందించిన క్రీకెట్కు సంబంధించిన వ్యాపారంలోకి.
ఆయన ఐపీఎల్ టీం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ ఇపుడు సపరేట్ రాష్ట్రం అయిన నేపథ్యంలో హైదరాబాద్ సన్రైజర్స్ తెలంగాణ టీం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రలో కూడా ఓ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
దీనికి ‘వైజాగ్ సిక్సర్స్' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2017లో ఈ టీం ఐపీఎల్లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. త్వరలో మహేష్ బాబు నుండి ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అకాశం ఉందని టాక్. మహేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ఉండటంతో ఐపీఎల్ టీం కొనుగోలు బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.